News February 16, 2025
వికారాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు

వికారాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఆదివారం 36.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పనులపై బయటకు వెళ్లేవారు, కూలీలు, రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కువగా బయటికి రాకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే 3 నెలలు ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News March 15, 2025
యూఎస్లో ఎప్పటికీ భాగమవ్వం: కెనడా ప్రధాని

కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ వస్తూనే తన మార్క్ చూపించారు. తమ దేశం ఎప్పుడూ యూఎస్లో భాగం కాబోదని స్పష్టం చేశారు. అయితే దేశ ప్రయోజనాల కోసం తాము ట్రంప్ అడ్మినిష్ట్రేషన్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాగా జస్టిన్ ట్రూడో స్థానంలో కార్నీ కెనడా 24వ ప్రధాని ప్రమాణస్వీకారం చేశారు. ట్రంప్ యూఎస్ అధ్యక్షుడు అయ్యాక కెనడాను తమ దేశంలో భాగమవ్వమని కోరిన సంగతి తెలిసిందే.
News March 15, 2025
NZB: గ్యాస్ స్టవ్ పేలి వాచ్మెన్ మృతి

నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో నాలుగేళ్లుగా వాచ్మెన్గా పని చేసే కోట్ల అనంత్(52) ఈ నెల 6న టీ పెట్టుకునేందుకు స్టవ్ ముట్టించగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం చికిత్స పొందుతూ అనంత్ మృతి చెందినట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. మృతుడి స్వగ్రామం నిర్మల్ జిల్లా దిబ్బిడి గ్రామం అని పోలీసులు తెలిపారు.
News March 15, 2025
జగన్ మరో 20ఏళ్లు కలలు కనాలి: నాగబాబు

AP: నోటి దురుసు ఉన్న నేతకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వలేదని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. వచ్చేసారి అధికారం తమదే అని జగన్ అంటున్నారని అంతకన్నా హాస్యం మరోటిలేదన్నారు. మరో 20సంవత్సరాలు జగన్ ఇలానే కలలు కంటూ ఉండాలని కోరారు. దేవుడైనా అడిగితే వరాలు ఇస్తాడు కానీ పవన్ అడగకుండానే వరాలు ఇస్తాడని కొనియాడారు. రెండు మూడు తరాల గురించే ఆలోచించే వ్యక్తి ఆయనని అందుకే అయనకు అనుచరుడిగా ఉంటున్నానని తెలిపారు.