News February 16, 2025
అనకాపల్లి: మాస్టర్స్ అథ్లెటిక్స్లో మెరిసిన నేవీ ఉద్యోగి

అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలోని శంభు వానిపాలానికి చెందిన నేవీ ఉద్యోగి అప్పన్న దొర జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్లో సత్తా చాటారు. రాజస్థాన్లో ఈ నెల 6, 7, 8 తేదీల్లో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్లో 45 ఏళ్ల విభాగంలో 4×400 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకాన్ని, 4×100 200 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకం, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్ కాంస్య పతకం పొందారు. ఆదివారం ఆయనను గ్రామస్థులు సత్కరించారు.
Similar News
News September 16, 2025
హైదరాబాద్లో వర్షాల తీరిదే..!

HYDలో ఏడాదిలో కురుస్తున్న వర్షాల తీరు పరిశీలిస్తే ‘కురిస్తే కుంభవృష్టి.. లేదంటే అనావృష్టి’ అన్నట్లుగా ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. వర్షం ప్రారంభమైన గంట వ్యవధిలోనే 15 సెంటీమీటర్ల వర్షం ఒక్కసారిగా కురుస్తోందని, రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. దీంతో ఒకే చోట వరదలు ముంచెత్తి, ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
News September 16, 2025
DSC: జిల్లాలో మిగిలిపోయిన 56 పోస్టులు

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 807 పోస్టులకు డీఎస్సీ-2025 తుది ఫలితాలు విడుదలయ్యాయి. 775 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరవగా, 755 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ 19న అమరావతిలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఉద్యోగ అర్హత పత్రాలు అందించనున్నారు. కొన్ని కేటగిరీలలో అభ్యర్థులు లేక జిల్లాలో 56 పోస్టులు మిగిలాయి.
News September 16, 2025
పార్వతీపురం: నేటి నుంచి వాహనమిత్ర దరఖాస్తుల స్వీకరణ

నేటి నుంచి వాహనమిత్ర దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల్లో స్వీకరించనున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అర్హత పొందిన వారికి ఈ పథకం కింద ప్రభుత్వం రూ.15వేలు ఆర్థిక సాయం అందజేయనుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ఏపీలో రిజిస్టర్ కాబడిన ఆటో రిక్షా, మోటార్ క్యాబ్ డ్రైవర్లు అర్హులన్నారు.