News March 20, 2024

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి: కలెక్టర్

image

జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా సంబంధిత అధికారులు చూడాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మైనింగ్ అనుమతులకు రెవెన్యూ అధికారుల ఎల్ఓసి తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

Similar News

News July 5, 2024

మెదక్: సదరం క్యాంప్ తేదీలు విడుదల

image

మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వికలాంగులను గుర్తించి అర్హతగల వారికి సదరం ధ్రువీకరణ పత్రం పొందేందుకుగానూ జులై -2024 సంబందించిన క్యాంప్ తేదీలను మీ సేవ / ఈ సేవ కేంద్రాలకు కేటాయించినట్లు డీఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు. దివ్యాంగులు తమ దగ్గరలో ఉన్న మీ సేవ/ ఈ సేవ కేంద్రం వద్ద ఆన్ లైన్‌లో స్లాటు బుక్ చేసుకొని కేటాయించిన రోజు ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.

News July 5, 2024

ప్రజల్లో చైతన్యం నింపడంలో కవులు, రచయితలు ముందుండాలి: KCR

image

తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపడంలో కవులు రచయితలు ముందుండాలని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, MLC గోరేటి వెంకన్న ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నదీ జలాల వాటాను సాధించుకోవడంలో ఉమ్మడి రాష్ట్రంలో నాటి ఆంధ్రా నాయకత్వ స్వార్థంతో పాటు, తెలంగాణ నాయకత్వం అనుసరించిన నిర్లక్ష్య ధోరణి సోయిలేని తనం ప్రధాన కారణాలన్నారు.

News July 5, 2024

సిద్దిపేట: తల్లిని చంపి సహజ మరణంగా..

image

కొడుకు తల్లిని చంపి సహజ మరణంగా చిత్రీకరించాడు. పోలీసుల వివరాలు.. HYDకి చెందిన బాలకృష్ణమ్మ(54) కొడుకు సర్వేశ్, పక్కింటివారితో కలిసి నాచారంగుట్ట క్షేత్రానికి వచ్చింది. రాత్రి ఆమె అస్వస్థతకు గురి కాగా కొడుకు అసహనంతో తల్లి తలను నేలకేసి కొట్టడంతో స్పాట్‌లోనే చనిపోయింది. సహజ మృతిగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంట వెళ్లిన వారి ద్వారా అసలు విషయం తెలుసుకుని ఆమె కుమార్తె సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది.