News February 16, 2025
మంథని: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు

మంథని-గోదావరిఖని ప్రధాన రహదారిపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. విలోచవరం గ్రామానికి చెందిన తోట రాయమల్లును ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొనడంతో తలకు, కాలుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కాలు విరిగ్గా భయానకమైన దృశ్యాలు కనబడుతున్నాయి. స్థానికుల సాయంతో 108లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 3, 2026
ఆస్ట్రోనాట్స్కు జ్ఞాన దంతాలు, అపెండిక్స్ తీసేస్తారు

అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు జ్ఞాన దంతాలు, అపెండిక్స్ తొలగిస్తారట. సాధారణంగా వీటితో సమస్యలుండవు. కానీ ఇబ్బంది వస్తే త్వరగా తొలగించాలి. అందుకే.. అంతరిక్షంలో ఉండగా వీటి సమస్య వస్తే కష్టమని ముందే ఆపరేషన్ చేస్తారట. ఇటీవలే స్పేస్లోకి వెళ్లొచ్చిన శుభాంశు శుక్లా ఈ విషయం వెల్లడించారు. సెల్ఫ్ ట్రీట్మెంట్పై ట్రైనింగ్ ఇస్తారని, ఆపరేషన్లు లాంటివి మాత్రం అక్కడి జీరో గ్రావిటీలో చేసుకోలేమన్నారు.
News January 3, 2026
సిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాల వైస్ ప్రిన్సిపల్గా డాక్టర్ నాగర్జున

రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ గా డాక్టర్ నాగార్జున చక్రవర్తి నియామకమయ్యారు. వైద్య కళాశాల ప్రొఫెసర్ హెచ్ఓడీ అనస్థీషియా డిపార్ట్మెంట్ డాక్టర్ నాగార్జున చక్రవర్తిని రాష్ట్ర డీఎంఈ ఆదేశాల మేరకు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరీ వైస్ ప్రిన్సిపల్గా (అడ్మినిస్ట్రేటివ్ విభాగం ) నియమించారు.
News January 3, 2026
జగిత్యాల: ‘వసతి గృహాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’

వసతి గృహాల్లో విద్యార్థుల పట్ల బాధ్యతాయుతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని జగిత్యాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కే.రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో షెడ్యూల్డ్ కులాల వసతి గృహ ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగుల సంఘం-2026 క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. విద్యార్థుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఉన్నారు.


