News February 16, 2025

RR: ఉమ్మడి జిల్లాలో తగ్గిన ద్రాక్ష పంట సాగు..!

image

ఉమ్మడి RR జిల్లాలో దశాబ్దం క్రితం 10 వేలకు పైగా ఎకరాల్లో సాగైన ద్రాక్ష ప్రస్తుతం కేవలం 115 ఎకరాలకు పరిమితమైందని అధికారులు చెబుతున్నారు. పరిస్థితి మారిందని అప్పటిలా భూములు లేకపోవడంతో ద్రాక్ష సాగు తగ్గిపోతున్నట్లుగా అధికారులు తెలుపుతున్నారు. కూలీల ఖర్చులు సైతం పెరుగుతున్నాయని, దిగుమతి సమయంలో ఈదురుగాలి, వడగండ్లతో నష్టపోవాల్సి వస్తుందన్నారు. మేడ్చల్, శామీర్పేట, కీసరలో అప్పట్లో సాగు చేసేవారు.

Similar News

News January 15, 2026

ఏడాదికి రూ.40 లక్షలకు పైగా ఆదాయం

image

ప్రస్తుతం ఉమేష్ ఎకరానికి 10 టన్నుల తాజా మునగ ఆకులను సేకరిస్తున్నారు. ఆకులను షేడ్ నెట్ల కింద సహజంగా ఎండబెట్టి, దాదాపు 2.5 నుంచి 3 టన్నుల వరకు పొడిని సేకరిస్తారు. kg సగటున రూ.140 చొప్పున ఫార్మా కంపెనీలు, న్యూట్రాస్యూటికల్ కంపెనీలు, ఎరువుల కంపెనీలకు విక్రయిస్తున్నారు. డిమాండ్ బట్టి కొన్నిసార్లు రూ.500కు అమ్ముతారు. ఏడాదికి మునక్కాయలు, పొడి నుంచి 10 ఎకరాలకు రూ.40 లక్షల ఆదాయం పొందే స్థాయికి ఎదిగారు.

News January 15, 2026

సంక్రాంతికి అరిసెలు ఎందుకు చేస్తారు?

image

సంక్రాంతి పంటల పండుగ కాబట్టి కొత్తగా చేతికి వచ్చిన బియ్యం, బెల్లం, నువ్వులSతో అరిసెలు చేస్తారు. చలికాలంలో శరీరానికి అవసరమైన వేడిని, శక్తిని, ఐరన్‌ను ఈ పదార్థాలు అందిస్తాయి. అరిసెలు ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల, పండుగకు వచ్చే అతిథులకు, అత్తారింటికి వెళ్లే అల్లుళ్లకు వీటిని ప్రేమపూర్వకంగా ఇస్తుంటారు. సంప్రదాయం ప్రకారం శుభకార్యాలకు, పండుగలకు అరిసెను ఒక సంపూర్ణమైన, మంగళకరమైన పిండివంటగా భావిస్తారు.

News January 15, 2026

నిర్మల్: ఓటర్ల లెక్క కొలిక్కి.. ఇక మొదలెడదామా

image

నిర్మల్ జిల్లాలోని నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి మొదలైంది. మొత్తం 1,67,015 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈనెల 17 లేదా 18న నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అగ్రనేతలు గెలుపు గుర్రాల వేటలో నిమగ్నమయ్యారు. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు.