News February 17, 2025
రాజమండ్రి: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

తూ.గో జిల్లాలో కూరగాయలు సాగు చేస్తున్న రైతులు స్థానిక మార్కెట్లలో లేదా దళారులకు తక్కువ ధరలకు వాటిని అమ్మి నష్టపోవద్దని జేసీ చిన్న రాముడు సూచించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రైతుల కష్టాన్ని దళారీల వ్యవస్థ దగా చేస్తుందోని రాజమండ్రి నగరంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైతు బజార్లలో తమ పంటలను విక్రయించుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం మార్కెటింగ్ అధికారులను సంప్రదించాలని రైతులను కోరారు.
Similar News
News April 19, 2026
తూ.గో: రేపు యథావిధిగా PGRS, రెవెన్యూ క్లినిక్

తూ.గో జిల్లా వ్యాప్తంగా సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్లు యథావిధిగా జరుగుతాయని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించే జిల్లా స్థాయి కార్యక్రమంలో RDOలు, MROలు పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తారన్నారు. సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
News April 18, 2026
ఎకానమీ దిశగా కీలక అడుగులు: సీఎం చంద్రబాబు

ఇంటింటి నుంచి చెత్త సేకరణ ద్వారా సర్క్యులర్ ఎకానమీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘స్వచ్ఛ రథాలను’ ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు అన్నారు. నిడదవోలులో ఆయన మాట్లాడారు. మరుగుదొడ్లు, సోక్ పిట్లు, కిచెన్ గార్డెన్లు, మ్యాజిక్ డ్రెయిన్లు వంటి మౌలిక సదుపాయాలను విస్తృతంగా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్తును తయారు చేసేందుకు అదనంగా ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామన్నారు.
News April 18, 2026
ఎకానమీ దిశగా కీలక అడుగులు: సీఎం చంద్రబాబు

ఇంటింటి నుంచి చెత్త సేకరణ ద్వారా సర్క్యులర్ ఎకానమీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘స్వచ్ఛ రథాలను’ ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు అన్నారు. నిడదవోలులో ఆయన మాట్లాడారు. మరుగుదొడ్లు, సోక్ పిట్లు, కిచెన్ గార్డెన్లు, మ్యాజిక్ డ్రెయిన్లు వంటి మౌలిక సదుపాయాలను విస్తృతంగా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్తును తయారు చేసేందుకు అదనంగా ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామన్నారు.


