News February 17, 2025
రాజమండ్రి: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

తూ.గో జిల్లాలో కూరగాయలు సాగు చేస్తున్న రైతులు స్థానిక మార్కెట్లలో లేదా దళారులకు తక్కువ ధరలకు వాటిని అమ్మి నష్టపోవద్దని జేసీ చిన్న రాముడు సూచించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రైతుల కష్టాన్ని దళారీల వ్యవస్థ దగా చేస్తుందోని రాజమండ్రి నగరంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైతు బజార్లలో తమ పంటలను విక్రయించుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం మార్కెటింగ్ అధికారులను సంప్రదించాలని రైతులను కోరారు.
Similar News
News March 14, 2025
రాజమండ్రి: శక్తి యాప్ను ప్రతి మహిళ రిజిస్టర్ చేసుకోవాలి: ఎస్పీ

ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్ను ప్రతి మహిళ నిక్షిప్తం చేసుకొని ఆపద సమయంలో పోలీసులు నుంచి సహాయం పొందాలని జిల్లా ఎస్పీ టి.నరసింహ కిషోర్ తెలిపారు. శక్తి యాప్ డౌన్లోడ్, ఇన్స్టాలేషన్, ఫీచర్లపై జిల్లా టెక్నికల్ టీంతో ఆయన గురువారం సమీక్షించారు. ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలపై జరిగే అత్యాచారాలు, వేధింపులు, ఈవ్ టీజింగ్ వంటి వాటిని నివారించడానికి శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
News March 13, 2025
పిఠాపురం రేపటి పవన్ ప్రసంగంపై సర్వత్రా అసక్తి..!

రేపు పిఠాపురం వేదికగా జరగనున్న జనసేన అవిర్భావ సభపై రాజకీయంగా భారీ అసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో 21 సీట్లలో విజయం సాధించడం డిప్యూటీ సీఎంగా మొదటిసారి జరుగుతున్న సభ కావడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని కపాడాలనే నినాదంతో దేశవ్యాప్తంగా పవన్ చరిష్మా పెరిగింది. దీనితో రేపు ఆయన భవిష్యత్తు రాజకీయాలపై ఎలాంటి ప్రకటనలు చేస్తారని తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
News March 13, 2025
రాజమండ్రి: ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం..స్పాట్ డెడ్

స్థానిక మోరంపూడి ఫ్లై ఓవర్ పై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రైల్వే సైట్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న నరేశ్, బి.రమేష్లు లాలాచెరువు నుంచి బొమ్మూరు వైపు టూవీలర్ పై వెళ్తున్నారు. మోరంపూడి ఫ్లై ఓవర్కు చేరుకునే సమయానికి వెనక నుంచి ఒక కారు ఢీకొట్టడంతో నరేశ్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. రమేష్ తీవ్ర గాయాలతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసలు తెలిపారు.