News March 20, 2024

నీట్ పీజీ ఎగ్జామ్ ప్రీపోన్డ్

image

NEET PG-2024 పరీక్ష ప్రీపోన్డ్ అయింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జులై 7న జరగాల్సి ఉంది. అయితే జూన్ 23న నిర్వహించాలని నేషనల్ మెడికల్ కమిషన్ నిర్ణయించింది. జులై 15న ఫలితాలు వెలువడనున్నాయి.

Similar News

News October 6, 2024

దీపావళికి నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’

image

సుధీర్ వర్మ డైరెక్షన్‌లో నిఖిల్ హీరోగా నటిస్తున్న మూవీ అప్డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. ఆ చిత్రానికి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టైటిల్‌ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ దీపావళికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూవీలో రుక్మిణీ వసంత్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

News October 6, 2024

ఆకస్మిక వరదలు.. ఒకే కుటుంబంలో ఏడుగురు సమాధి

image

భారీ వర్షాల కారణంగా మేఘాలయలో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. 24 గంటల వ్యవధిలో 10 మంది మరణించారు. సౌత్‌గారో హిల్స్ జిల్లాలోని గసుఆపారాలో కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబంలోని ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. డాలు ప్రాంతంలో ముగ్గురు చనిపోయారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన సీఎం కాన్రాడ్ కె సంగ్మా వారికి వెంటనే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అధికారులను ఆదేశించారు.

News October 6, 2024

జానీ మాస్టర్‌ అవార్డును ఆపడం మూర్ఖత్వమే: నటుడు

image

పోక్సో చట్టం కింద కేసు నమోదవడంతో జానీ మాస్టర్‌కు దక్కిన నేషనల్ అవార్డును తాత్కాలికంగా నిలిపివేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఈ నిర్ణయాన్ని నటుడు, డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ ఖండించారు. ‘కేసు రుజువయ్యేవరకు జాతీయ అవార్డు ఇవ్వడం ఆపారు. మీరేమి పద్మభూషణ్, భారతరత్న ఇవ్వట్లేదు కదా. తన కొరియోగ్రఫీ టాలెంట్‌కు, తన వ్యక్తిగత జీవితంతో సంబంధం ఏంటి? ఇది మూర్ఖత్వమే. సారీ’ అని ట్వీట్ చేశారు.