News February 17, 2025
జనగామ: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 17 మంది గైర్హాజరు

జనగామ జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు 17 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ జితేందర్ రెడ్డి తెలియజేశారు. మొదటి సెషన్లో 161 మంది విద్యార్థులకు గాను 153 విద్యార్థులు హాజరయ్యారు. రెండో సెషన్లో 195 మంది విద్యార్థులకు గాను 186 విద్యార్థులు హాజరైనట్లు తెలియజేశారు.
Similar News
News September 18, 2025
HYD:తెలుగు వర్శిటీ.. విజేతలు వీరే!!

సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్శిటీలో వర్శిటీ సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించారు.
మహిళా విభాగం..
✒చేస్:1.షర్మిల,2.రమాదేవి
✒క్యారం:1.రజిత,2.షర్మిల
✒షార్ట్ పుట్(Sr’s):1.స్వాతి,2.ప్రమిత,3.పద్మ
✒షాట్ పుట్(Jr’s):1.శ్రీప్రియ,2. సీతల్,3.శ్రీలేఖ
✒రన్నింగ్(100 mts):1.శ్రీప్రియ,2.శీతల్,3.శ్రీలత
✒రన్నింగ్(200 mts):1.శీతల్,2.శ్రీలత,
3.లత
✒రన్నింగ్(400 mts):1.శీతల్,2 శ్రీలత,3.శ్రీప్రియ
News September 18, 2025
ఇద్దరు MBBS విద్యార్థుల ఆత్మహత్య

AP: విశాఖ గీతం మెడికల్ కాలేజీలో హిమాచల్ ప్రదేశ్కు చెందిన MBBS ఫస్ట్ ఇయర్ విద్యార్థి విస్మాద్ సింగ్ (20) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. నిన్న కాలేజీ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకున్నాడు. ‘ఈ లోకంలో నేను బతకలేను. నాకు మరో జన్మ వద్దు’ అని రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు MBBS ఫస్టియర్లో ఫెయిలైన విశాఖ NRI కాలేజీ స్టూడెంట్ జ్యోత్స్న ఆత్మహత్య చేసుకుంది.
News September 18, 2025
HYD: ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచండి: కమిషనర్

HYD సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (H-CITY) స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్(SNDP) పనులను మరింత వేగవంతం చేయాలని కమిషనర్ కర్ణన్ అధికారులను ఆదేశించారు. పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా పెండింగ్ పనులపై ఇంజినీర్లు ఫోకస్ పెట్టాలని సూచించారు.