News February 17, 2025

కామారెడ్డి: ఆర్టీసీ ఏసీ బస్సులో 10% రాయితీ

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి బెంగళూరు వరకు వెళ్లే ఆర్టీసీ ఏసీ బస్సులో 10 శాతం రాయితీ కల్పించినట్లు కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిరా తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె చెప్పారు. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థ ప్రత్యేక రాయితీలు కల్పిస్తుందని వివరించారు. ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికులకు అనుకూలమైన వసతులు కల్పించినట్లు తెలిపారు.

Similar News

News September 18, 2025

నిజామాబాద్, కామారెడ్డి RTCలో ఉద్యోగాలు

image

సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఉద్యోగాల ఖాళీలు ఇలా ఉన్నాయి. NZB జిల్లాలో 49, కామారెడ్డిలో 30 డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. NZB జిల్లాలో 19, కామారెడ్డి జిల్లాలో 12 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

News September 18, 2025

మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక దృష్టి సారించాలి: డీఈవో

image

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేలా ఎంఈవోలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. భోజనాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో కిచెన్ గార్డెన్‌లను పెంచడానికి చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటలోగా విద్యార్థుల హాజరును మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులకు తెలిపారు.

News September 18, 2025

కోళ్లలో రక్తపారుడు వ్యాధి – లక్షణాలు

image

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు <<17696499>>లిట్టరు<<>>ను పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.