News February 17, 2025

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షకు అవకాశం

image

ఫిబ్రవరి 3 నుంచి 22వ తేదీ వరకు జరిగే జనరల్, వొకేషనల్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో ఫీజు కట్టి పరీక్షకు హాజరు కానీ విద్యార్థులకు ఈనెల 18 నుంచి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్మీడియట్ కమిషనర్ కృష్ణఆదిత్య అనుమతి ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని DIEO వెంకటేశ్వరరావు సూచించారు. చుంచుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతుందని ప్రిన్సిపల్ కత్తి రమేష్ చెప్పారు.

Similar News

News November 3, 2025

ఉమెన్స్ WC ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?

image

టీమ్ ఇండియా ICC ఉమెన్స్ వన్డే <<18182320>>వరల్డ్ కప్<<>> విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో కప్పు కొట్టిన భారత్‌కు రూ.39.55 కోట్లు ప్రైజ్ మనీగా దక్కుతుంది. రన్నరప్ SA జట్టు రూ.19.77 కోట్లు అందుకుంటుంది. ఈ WCలో ప్రైజ్‌మనీ+బోనస్‌లు+పార్టిసిపేషన్ ఫీ+BCCI కార్యదర్సి దేవజిత్ సకారియా ప్రకటించిన రూ.51 కోట్లతో కలిపి మొత్తం భారత మహిళల జట్టుకు రూ.93.66 కోట్ల వరకు దక్కే అవకాశం ఉంటుంది.

News November 3, 2025

పరవాడ: తీరానికి కొట్టుకు వచ్చిన విద్యార్థి మృతదేహం

image

పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెం సముద్రతీరంలో స్నానం చేస్తుండగా ఈనెల 1వ తేదీన గల్లంతైన విద్యార్థి భాను ప్రసాద్ (15) మృతదేహం ఆదివారం అదే తీరానికి కొట్టుకు వచ్చింది. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతిని తండ్రి పెంటయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 3, 2025

పెన్షన్ కోసం మూడేళ్లుగా ఎదురుచూపులు

image

భర్త మరణించి మూడేళ్లు గడిచినా పెన్షన్ కోసం ఇంకా ఎదురుచూస్తున్నట్లు గోపవరం(M) సండ్రపల్లికి చెందిన చెన్నమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. పెన్షన్ కోసం దరఖాస్తు చేసినా సచివాలయ అధికారుల నుంచి సరైన స్పందన లేదని వాపోయారు. అధికారులు కరుణించి, వితంతు పెన్షన్ మంజూరు చేయాలని వేడుకుంటున్నట్లు ఆమె కనీటి పర్యంతమయ్యారు. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.