News February 17, 2025

కేయుూ: 21 నుంచి LLB మొదటి సెమిస్టర్‌ పరీక్షలు

image

కేయూ పరిధిలో LLB మూడేళ్ల కోర్సు మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షలు(రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంట్‌) ఈ నెల 21 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఆసిమ్‌ ఇక్బాల్‌ తెలిపారు. ఈ నెల 21, 24, 28, మార్చి 3, 5 తేదీల్లో మ.2 నుంచి సా. 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని చెప్పారు.

Similar News

News July 6, 2025

చెంచులకు 13,266 ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం చెంచులకు 13,266 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రేపు అచ్చంపేటలోని మున్ననూర్‌లో జరిగే కార్యక్రమంలో చెంచులకు తొలి విడత ఇళ్లను మంజూరు చేయనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అత్యధికంగా ఆసిఫాబాద్‌లో 3,371, అత్యల్పంగా నాగార్జున‌సాగర్‌లో 17 ఇళ్లు కేటాయించారు.

News July 6, 2025

రాయచోటిలో ఘోర ప్రమాదం

image

రాయచోటిలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయచోటి-మదనపల్లె మార్గంలోని ఇస్తిమా మైదానానికి సమీపాన ఉన్న శ్రీనివాసపురం వద్ద లారీ, ఇన్నోవా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగంతో మృతదేహం ఛిద్రమైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2025

పటాన్‌చెరు: మానవ అవశేషాల అప్పగింత సజావుగా జరగాలి: కలెక్టర్

image

సిగచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి అవశేషాల అప్పగింత సజావుగా జరగాలని కలెక్టర్ ప్రావిణ్య ఆదేశించారు. పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రిని ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. ఇప్పటివరకు 42 మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు. మరో 8 మంది గల్లంతవగా, వారి మృతదేహాల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.