News February 17, 2025
ఆదిలాబాద్: ఉరేసుకుని ఉపాధ్యాయుడి సూసైడ్

ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా మావలలో చోటుచేసుకుంది. SI విష్ణువర్ధన్ వివరాల ప్రకారం.. నేరడిగొండ మండలం వెంకటాపూర్కు చెందిన బానోత్ సంతోష్ (28) జైనూర్ మండలం జామిని గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. కొన్నాళ్లుగా ఆదిలాబాద్లోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న సంతోష్ ఆదివారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 16, 2026
‘ఖమ్మం సభను విజయవంతం చేయండి’

పెద్దపల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో CPI శత జయంతి ఉత్సవాల గోడపత్రికలను జిల్లా నాయకులు విడుదల చేశారు. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని CPI జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం పిలుపునిచ్చారు. పార్టీ వందేళ్ల ప్రస్థానంలో సాధించిన విజయాలను ఈ సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కౌన్సిల్ సభ్యులు బాలసాని లెనిన్, ఆరెపల్లి మానస్, నవీన్, శివ తదితరులు పాల్గొన్నారు.
News January 16, 2026
సదర్ మట్ బ్యారేజ్ను ప్రారంభించిన సీఎం

మామడ మండలం పొన్కల్ గ్రామంలోని గోదావరి నదిపై రూ.576 కోట్లతో నిర్మించిన సదర్ మట్ బ్యారేజ్ను శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బ్యారేజ్కు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిమోట్ ద్వారా గేట్లను ఓపెన్ చేశారు.
News January 16, 2026
ఫోర్త్ సిటీలో ఎగిరే టాక్సీలు.. స్కైరైడ్ సిద్ధం!

HYDకు ఎగిరే టాక్సీలు రానున్నాయి. ఫోర్త్ సిటీలో ఈ ‘వర్టిపోర్ట్స్’ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విమానాలకు రన్-వే కావాలి. కానీ ఈ ఎయిర్ టాక్సీలు (eVTOL) హెలికాప్టర్ లాగా నిలువుగాపైకి లేస్తాయి, కిందకు దిగుతాయి. అందుకే వీటికి ఎయిర్పోర్ట్ అవసరం లేదు. ఇవి హై స్పీడ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ హబ్లు కూడా. యాప్లో బుక్ చేస్తే ఇంటి మీద ఆగుతాయి. ఫోర్త్ సిటీనుంచి 10MINలో సైలెంట్గా ఎయిర్పోర్టుకు వెళ్లొచ్చు.


