News February 17, 2025
అక్కుపల్లి శివ సాగర్ బీచ్లో దొరికిన బ్యాగ్ అప్పగింత

వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి శివ సాగర్ బీచ్ను ఆదివారం భారీగా పర్యాటకులు సందర్శించారు. ఈ క్రమంలో మెలియాపుట్టి మండలం తంగణి గ్రామానికి చెందిన సవర త్రివేణి తన సర్టిఫికేట్స్లు ఉన్న బ్యాగ్ మార్చిపోయింది. ఈ విషయాన్ని అక్కుపల్లి శ్రీ రామాసేవా సంఘం వారు గుర్తించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అది చూసి బాధితురాలికి ఆ బ్యాగ్ అప్పగించారు. అక్కడ ప్రజలు శ్రీ రామా సేవాసంఘం సభ్యులను అభినందించారు.
Similar News
News July 7, 2025
శ్రీకాకుళం: గిరి ప్రదక్షిణకు వెళ్తున్నారా..రూట్ మ్యాప్ ఇదే

గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈనెల 9 ఉ.6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 వరకు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వైపు వచ్చు ప్రైవేటు ట్రావెల్ బస్సులు, RTC బస్సులు, ఇతర వాహనదారులు నగరంలోకి రాకుండా ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి చేరుకోవాలని సూచించారు.
News July 7, 2025
శ్రీకాకుళం: సేంద్రీయ ఎరువులతో అధిక దిగుబడి

శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో డీపీఆర్సీ వారు ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్టు స్టాల్లను DPO భారతి సౌజన్య సోమవారం పరిశీలించారు. సంపద కేంద్రాల్లో చెత్త ద్వారా వర్మీ కంపోస్టు తయారీ చేసి అమ్మకాలు జరపాలని తెలిపారు. సేంద్రియ ఎరువులపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సేంద్రియ ఎరువుల వలన అధిక పంట దిగుబడి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్సీ రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.
News July 7, 2025
నందిగాం: పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్య

నందిగాం మండలం జయపురం గ్రామానికి చెందిన ఆర్.రత్నాలు(54) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు గత కొద్ది రోజులుగా మహిళ అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి ఇంటిలో పురుగు మందు తాగింది. అపస్మారక స్థితిలో చేరుకున్న ఆమెను కుటుంబీకులు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. నందిగాం పోలీసులు కేసు నమోదు చేశారు.