News February 17, 2025

సాలెగూడలో ఐదుగురిపై కేసు

image

ఆసిఫాబాద్ మండలం సాలెగూడ గ్రామ శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ముందస్తు సమాచారం మేరకు పేకాట శిబిరంపై దాడి చేసి ఐదుగురు జూదరులను పట్టుకున్నట్లు సీఐ రవీందర్ తెలిపారు. వారి వద్ద రూ.3,020 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News September 17, 2025

సోషల్ మీడియా పోస్టుకి స్పందించిన DyCM పవన్ కళ్యాణ్

image

ట్విట్టర్‌(X)లో ఒక సామాన్యుడు పెట్టిన పోస్టుకు DyCM పవన్ కళ్యాణ్ స్పందించారు. గుంతలమయంగా మారిన ఏలేశ్వరం – అడ్డతీగల రోడ్డు దుస్థితిపై చైతన్య రాజు అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పవన్ ఈ పోస్టుకు స్పందించి, తక్షణ మరమ్మతులకు ఆదేశాలు జారీ చేశారు. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ నిధులతో రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

News September 17, 2025

76వ వసంతంలోకి ప్రధాని మోదీ

image

ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నేడు 76వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఓ సాధారణ కుటుంబం నుంచి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశానికి ప్రధానిగా ఎదిగారు. గుజరాత్‌కు 13 ఏళ్లు సీఎంగా చేశారు. 11 ఏళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రశంసలతో పాటు విమర్శలనూ ఎదుర్కొన్నారు. ప్రధానిగా ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. Happy Birthday PM Narendra Modi.

News September 17, 2025

S.కొండ: ఫోక్సో కేసుపై DEO కార్యాలయంలో చర్చ

image

ఒంగోలు DEO కార్యాలయంలో సింగరాయకొండలో జరిగిన ఫోక్సో కేసు అంశంపై మంగళవారం చర్చ జరిగింది. ఈ సమావేశంలో డీఈఓ కిరణ్ కుమార్, డిప్యూటీ ఈవో చంద్రమౌళీశ్వరు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పాఠశాలల్లో జరిగిన లైంగిక వేధింపుల కేసులను 164 స్టేట్మెంట్ ఆధారంగా తప్పుడు రీతిలో రిఫర్ చేస్తున్న పరిస్థితిపై చర్చ సాగింది. దీనిపై తగిన చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని డీఈఓ తెలిపారు.