News March 20, 2024
జగ్గీ వాసుదేవ్కు ప్రధాని మోదీ ఫోన్

ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు <<12891847>>జగ్గీ<<>> వాసుదేవ్కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఆయనతో మాట్లాడి ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జగ్గీవాసుదేవ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మోదీ ట్వీట్ చేశారు. దీనికి ‘నాపై మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ జగ్గీ వాసుదేవ్ రిప్లై ఇచ్చారు.
Similar News
News October 25, 2025
పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,250 పెరిగి ₹1,25,620కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,150 ఎగిసి ₹1,15,150గా ఉంది. అటు KG వెండి ధర రూ.1,70,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News October 25, 2025
డైట్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

AP: డైట్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల ఖాళీలను డిప్యూటేషన్ ప్రాతిపదికన భర్తీకి SCERT నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 29 నుంచి లీప్ యాప్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది. వచ్చే నెల 5-8 వరకు రాత పరీక్షలు నిర్వహించి, 13న రిజల్ట్స్ వెల్లడిస్తామని తెలిపింది. అనంతరం త్రిసభ్య కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందని వెల్లడించింది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుందని స్పష్టం చేసింది.
News October 25, 2025
పాములను పూజించడం వెనుక పర్యావరణ హితం

సాధారణంగా శీతాకాలంలో, పంటలు ఇంటికొచ్చే సమయంలో పాములు పుట్టల నుంచి, వాటి రంధ్రాల నుంచి బయటకు వస్తాయి. ఈ సమయంలో వాటిని హింసించకుండా ఉండేందుకు ఈ పండుగ జరుపుతారు. నాగ దేవతలు పొలాల్లోని ధాన్యాన్ని నాశనం చేసే ఎలుకలను వేటాడి, పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. ప్రకృతిలోని ఏ జీవినీ సంహరించకుండా, ప్రతి ప్రాణికీ జీవించే హక్కును గౌరవించాలని మన ఆచారం బోధిస్తుంది. పాములను పూజించడం ద్వారా నాగజాతిని కాపాడినట్లే.


