News March 20, 2024

KTDM:పోలీసుల ఎదుట శబరి ఏరియా మావోయిస్టు లొంగుబాటు

image

తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు చర్ల మండలం ఎర్రంపాడుకి చెందిన మడివి బుద్ర బుధవారం జిల్లా పోలీసులు, 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ అధికారులు సమక్షంలో లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ప్రభుత్వం తరఫున ఇతనిపై రూ. 4లక్షల రివార్డు ఉందని, మావోయిస్ట్ పార్టీ నాయకుల వేధింపులు భరించలేక లొంగిపోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈసమావేశంలో సీఆర్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 3, 2026

ఖమ్మం బస్టాండ్‌లో బాదుడు.. నిబంధనలకు పాతర!

image

ఖమ్మం నూతన బస్ స్టేషన్‌లో తినుబండారాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్లాట్‌ఫారమ్‌లపై ఉన్న స్టాళ్లలో ఎంఆర్‌పీ నిబంధనలను గాలికి వదిలేసి, స్నాక్స్, వాటర్ బాటిళ్లను ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. అధిక ధరలపై ప్రయాణికులు ప్రశ్నిస్తే నిర్వాహకులు దురుసుగా సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు. ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించి, తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు కళ్లెం వేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

News January 3, 2026

ఖమ్మం ఆయుర్వేద ఆసుపత్రిలో మందులు నిల్!

image

ఖమ్మం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల మందుల కొరతతో వెలవెలబోతోంది. మూడు నెలలుగా ఇక్కడ మందులు అందుబాటులో లేకపోవడంతో చికిత్స కోసం వచ్చే రోగులు రిక్తహస్తాలతో వెనుదిరుగుతున్నారు. పెద్ద సంఖ్యలో బాధితులు ఈ ఆసుపత్రిని ఆశ్రయిస్తుంటారు. వైద్యులు పరీక్షించి చీటీలు రాసిస్తున్నా, మందుల కౌంటర్‌లో నిల్వలు లేవని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మందుల సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

News January 3, 2026

ఖమ్మం: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కండి: అదనపు కలెక్టర్

image

రానున్న మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై అదనపు కలెక్టర్ శ్రీజ జిల్లాలోని అందరు మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని, ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.