News February 17, 2025

రోడ్డు ప్రమాదంలో గాజువాక యువకుడి మృతి

image

గాజువాకకు చెందిన కర్రీ సాయికిరణ్(17) పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా బైక్‌ అదుపుతప్పి బండరాయిను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. G.మాడుగుల(M) గుదలం వీధి మలుపు వద్ద ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో పోలీసుల సహాయంతోనే పాడేరు తరలించారు. అక్కడి నుంచి కేజీహెచ్‌కు తీసుకొస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. సాయి కిరణ్ మృతితో చైతన్య నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News September 15, 2025

విశాఖ డాగ్ స్క్వాడ్.. నేర నియంత్రణలో కీలకం

image

విశాఖ నగర పోలీస్ డాగ్ స్క్వాడ్‌లో 18 శునకాలు నేర నియంత్రణలో పాలుపంచుకుంటున్నాయి. వీటిలో 10 నార్కోటిక్, 6 ఎక్స్‌ప్లోజివ్, 2 ట్రాకర్ డాగ్స్ ఉన్నాయి. ఇటీవల రైల్వే స్టేషన్ పరిధిలో ఈ జాగిలాలు 41 కిలోల గంజాయిని పట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్, జీవీఎంసీ సహకారంతో కొత్తగా 8 నార్కోటిక్ శునకాలు, నూతన కెన్నెల్స్ స్క్వాడ్‌లో చేరాయి. వీటికి క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News September 15, 2025

విశాఖ: ‘వీకెండ్‌లో స్విగ్గీ, జోమోటో రైడర్ల సమ్మె’

image

విశాఖలో స్విగ్గీ, జోమోటో రైడర్లు ప్రతి శని, ఆదివారాల్లో సమ్మె చేయాలని తీర్మానించారు. జగదాంబలో సీఐటీయూ కార్యాలయంలో రైడర్ల సమావేశం జరిగింది.‌ జోమాటో యాజమాన్యం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందో? లేదో? చూస్తామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కుమార్ అన్నారు. స్విగ్గీ యాజమాన్యం చర్చలకు రాలేదని తెలిపారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు.

News September 15, 2025

విశాఖలో పర్యటించనున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

image

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 17న విశాఖలో పర్యటించనున్నారు. 16న రాత్రి ఆమె విశాఖ చేరుకుని ప్రైవేటు రిసార్ట్‌లో బస చేస్తారు. 17న ఉదయం 10 గంటలకు ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్లో జిఎస్టి సంస్కరణలపై ఔట్ రీచ్ ప్రోగ్రాంలో పాల్గొంటారు. 12 గంటలకు స్వస్థ నారీ కార్యక్రమంలో వర్చువల్‌గా ప్రసంగిస్తారు.‌ 3 గంటలకు జీసీసీ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.