News February 17, 2025

అమలాపురం: ఎమ్మెల్సీ ఎన్నికకు ముమ్మర ఏర్పాట్లు

image

ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ గడువు సమీపిస్తోంది. దీంతో జిల్లా యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలైంది. బ్యాలెట్ పత్రాల ముద్రణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బందికి శిక్షణ తదితర పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 27న ఉ.8 గంటల నుంచి సా.4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 6 జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 2 వేల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.

Similar News

News January 14, 2026

Next 7Daysలో వెండి పెరిగేనా? తగ్గేనా?

image

ఇవాళ $94-$95 ఉన్న ఔన్స్ (28.3గ్రా.) సిల్వర్ ఈ నెలలో 100$కు చేరొచ్చనేది మార్కెట్ విశ్లేషకుల మాట. ఈ లెక్కన Next 7 Days వైట్ మెటల్ రేట్ పెరుగుతుందని వారి అంచనా. USA ఫెడరల్ రిజర్వు నిర్ణయాలు, ట్రంప్ ఆదేశాలపై సుప్రీంకోర్టు విచారణ, ఇరాన్ ఉద్రిక్తతలు తదితర అంశాలు స్టాక్స్‌లో ఒడిదుడుకులు, మెటల్స్‌లో గ్రోత్‌కు కారణం కావచ్చు అని తెలిపారు.
⚠️ఈ ఆర్టికల్ కొనడం/అమ్మడం ప్రోత్సహించేందుకు కాదు. అవగాహన కోసమే.

News January 14, 2026

ఇంట్రెస్టింగ్ విషయం పంచుకున్న అనిల్ రావిపూడి

image

టాలీవుడ్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలుగు ప్రజలకు భోగి శుభాకాంక్షలు చెబుతూ ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. తన కెరీర్‌లో వరుసగా ఆరు సినిమాలు ₹100Cr+ క్లబ్‌లో చేరినట్లు వెల్లడించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో తీసిన <<18853731>>MSVPG<<>> అయితే 2రోజుల్లోనే ఈ ఫీట్ సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంక్రాంతిని మరింత స్పెషల్‌గా మార్చారంటూ ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు.

News January 14, 2026

HYD: సీఎం సభల తర్వాతే మున్సిపల్ నగారా!

image

TGలో మున్సిపల్ పోరుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. అయితే, దీనికి ముందే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కలియతిరగనున్నారు. ఉత్తర, దక్షిణ, మధ్య ప్రాంతాల్లో 3 భారీ సభలు నిర్వహించనుంది. ప్రజల్లోకి వెళ్లిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ భావిస్తోంది. ఈ సభలు ముగిసిన వెంటనే SEC ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. సీఎం టూర్ ఖరారైన తర్వాతే క్లారిటీ రానుంది. STAY TUNED..