News February 17, 2025

కరీంనగర్: తాగుడుకు బానిసై వృద్ధుడి ఆత్మహత్య

image

శంకరపట్నం మండలం మెట్‌పల్లిలో ముప్పిడి రామ్ రెడ్డి (72)అనే వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరుకు చెందిన రామ్ రెడ్డి తన మేన బామ్మర్ది తుమ్మల పురుషోత్తం రెడ్డి ఇంటివద్ద ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని కుటుంబ సభ్యులు దూరమడం వలన మనోవేదనతో తాగుడుకు బానిసై ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పురుషోత్తం రెడ్డి పేర్కొన్నాడు.

Similar News

News November 8, 2025

ఇడుపులపాడు చెరువులో 16 ఏళ్ల యువకుడు గల్లంతు

image

ఇంకొల్లు మండలం ఇడుపులపాడులోని చెరువులో 16 ఏళ్ల యువకుడు ఈతకు వెళ్లి గల్లంతైన ఘటన శనివారం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఉదయం 10 గంటల సమయంలో స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లిన అతను బయటకు రాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అగ్నిమాపక సిబ్బంది బోటు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడినప్పటికీ లైట్లు వేసి గాలిస్తున్నారు.

News November 8, 2025

సంతోష సాగరం… ముంబై మహానగరం

image

ముంబై అనగానే మనకు గజిబిజి జీవితాలు కళ్లముందు ప్రత్యక్షమవుతుంటాయి. కానీ అందుకు భిన్నంగా ఆసియాలోనే ఇతర నగరాలకు మించి ఎన్నో ఆనందానుభూతుల్ని అందించే ప్రాంతాల్లో నం.1గా నిలిచింది. ‘Time Out’s City Life Index-2025’ సర్వేలో ఇది వెల్లడైంది. సంస్కృతి, జీవన నాణ్యత, స్థానికుల ఆదరణ, ఉపాధి వంటి అంశాలపై సర్వే చేపట్టి సంస్థ విశ్లేషించింది. ఆసియాలోని బీజింగ్, షాంఘై, చాంగ్ మాయి, హనోయ్‌లను ముంబై బీట్ చేసింది.

News November 8, 2025

విశాఖ: ‘బెదిరించి రూ.14 లక్షలు దోచేశారు’

image

59 ఏళ్ల వ్యక్తికి ఫోన్ చేసి మీ నంబర్‌పై కేసు నమోదైందని బెదిరించి రూ.14 లక్షలు దోచుకున్న ఘటన విశాఖలో చోటుచేసుకుంది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు విశాఖ CPని ఆశ్రయించారు. కేసు విచారణలో నిందితులుగా కృష్ణా జిల్లాకు చెందిన తారకేశ్వర్రావు, శివకృష్ణ, నాగరాజు, చందు, అబ్దుల్ కరీంగా గుర్తించారు. వీరు 350 నకిలీ సిమ్స్‌ తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. నిందితులను శనివారం అరెస్ట్ చేశామన్నారు.