News February 17, 2025

రాయపోల్: గొప్ప మనసు చాటుకున్న నాగేంద్ర కుటుంబీకులు

image

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం ఆరెపల్లి(ఎస్జే) గ్రామానికి చెందిన కొంపల్లి నాగేంద్రకు ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందాడు. కాగా ఇంత దుఃఖంలోనూ వారి కుటుంబ సభ్యులు నాగేంద్ర అవయవాలు దానం చేసి గొప్ప మనస్సు చాటుకున్నారు. ఈ విషయం తెలిసి పలువురు వారి కుటుంబ సభ్యుల త్యాగాన్ని అభినందిస్తున్నారు.

Similar News

News January 16, 2026

కేంద్ర విద్యుత్ సవరణ రూల్స్‌ను వ్యతిరేకిస్తూ TG నివేదిక

image

TG: కేంద్ర ముసాయిదా విద్యుత్ (సవరణ) బిల్లు-2025లోని కొన్ని నిబంధనలను TG వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర ERCలకు పూర్తి అధికారాలు, విద్యుత్ సబ్సిడీల హేతుబద్ధీకరణ, పరిశ్రమలు నేరుగా విద్యుత్‌ కొనుగోలు వంటి నిబంధనల్ని కేంద్రం ఈ ముసాయిదాలో ప్రతిపాదించింది. వీటిపై రాష్ట్రం అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. ఈమేరకు రెండు డిస్కంలు నివేదికను సిద్ధం చేశాయి. CM అనుమతితో అధికారులు దీన్ని కేంద్రానికి సమర్పించనున్నారు.

News January 16, 2026

GHMC రిజర్వేషన్లు ఖరారు.. బీసీలకు 40% స్థానాలు

image

GHMC పరిధిలోని 300 డివిజన్లకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఫైనల్ చేసింది. 2011 జనాభా లెక్కలు, BC డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేసింది. BCలకు 122 స్థానాలు కేటాయించారు. పురుషులు, మహిళలకు సమానంగా చెరో 61 సీట్లు ఇచ్చారు. SCలకు 23 (M-12, F-11), STలకు 5 (M-3, F-2) స్థానాలు కేటాయించారు. జనరల్ మహిళలకు 76, అన్‌రిజర్వుడ్‌గా 74 స్థానాలు ప్రకటించారు. మొత్తంగా మహిళలకు 150 స్థానాలు దక్కాయి.

News January 16, 2026

భిక్కనూర్: అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన బిక్కనూరు మండలం జంగంపల్లిలో జరిగింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గాడి నరసింహులు(53) ఇటీవల కొత్త ఇల్లు నిర్మించగా, అప్పులు పెరిగిపోయాయి. దీంతో మనస్తాపానికి గురైన ఆయన, గురువారం రాత్రి తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.