News February 17, 2025

పరిగి టీచర్‌కు యాక్సిడెంట్

image

మొయినాబాద్ మం.లోని కనకమామిడి చౌరస్తాలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన 2 కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పరిగిలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించే శ్రీను, అతడి భార్య, కుమారుడికి గాయాలయ్యాయి. మొయినాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.

Similar News

News December 29, 2025

ఈనెల 30న కలెక్టరేట్‌లో వర్క్ షాప్: జేసీ

image

నూతన ఆవిష్కరణల ద్వారా ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లను బలోపేతం చేసేందుకు ఈనెల 30న బొమ్మూరు కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు జేసీ మేఘా స్వరూప్ తెలిపారు. నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NRDC), RTIH సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో మేధో సంపత్తి హక్కులు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, వాణిజ్యీకరణ వంటి కీలక అంశాలపై నిపుణులు అవగాహన కల్పిస్తారని జేసీ పేర్కొన్నారు.

News December 29, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.710 తగ్గి రూ.1,41,710కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల పసిడి రూ.650 తగ్గి రూ.1,29,900 పలుకుతోంది. అటు కొద్ది రోజులుగా విపరీతంగా పెరిగిన వెండి ధరలు ఇవాళ దిగివచ్చాయి. కేజీ వెండి ధర రూ.4,000 తగ్గి రూ.2,81,000 పలుకుతోంది.

News December 29, 2025

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి పదోన్నతి

image

తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్‌కు సెలక్షన్ గ్రేడ్ ఐపీఎస్‌గా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.
2013 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో పల్నాడు జిల్లా ఎస్పీగా, తిరుమల తిరుపతి దేవస్థానంలో చీఫ్ విజిలెన్స్ & సెక్యూరిటీ విభాగ అధికారిగా పనిచేశారు. అనంతరం తూ. గో జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు పదోన్నతి రావడంతో ఏఎస్పీలు, డీఎస్పీలు, సిఐలు, ఇతర సిబ్బంది అభినందించారు.