News February 17, 2025

ఉప్పల్‌లో 9 మ్యాచులు ఉన్నా SRH ఫ్యాన్స్‌కు నిరాశే..

image

IPL 2025 షెడ్యూల్ ప్రకారం ఉప్పల్ వేదికగా 9 మ్యాచులు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే HYDలో లీగ్ దశలో ఆర్సీబీ, సీఎస్కేతో ఒక్క మ్యాచ్ కూడా లేకపోవడం SRH అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఈ టీమ్స్‌లోనే ధోనీ, కోహ్లీ వంటి కీలక ప్లేయర్లు ఉన్నారు. అయితే MIతో ఏప్రిల్ 23న మ్యాచ్ ఉండటం కాస్త ఊరటనిస్తోంది. మరి ఉప్పల్ వేదికగా జరిగే క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆ జట్లతో తలపడుతుందేమో చూడాలి.

Similar News

News April 18, 2026

బిల్లుపై కేంద్రం Vs ప్రతిపక్షాలు.. మీ అభిప్రాయమేంటి?

image

131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రజల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. మహిళలకు మంచి చేయాలనుకున్న కేంద్రం.. పాత రిజర్వేషన్ బిల్లునే పెట్టాల్సిందని, దానికి డీలిమిటేషన్‌ను లింక్ చేయడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. డీలిమిటేషన్‌ వల్ల అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుందని, ప్రతిపక్షాలకు మహిళల పట్ల గౌరవం లేకనే ఉమెన్ బిల్లును వ్యతిరేకించాయని మరికొందరు అంటున్నారు. బిల్లుపై మీ ఒపీనియన్?

News April 18, 2026

ప్రతిపక్షాలపై PM మోదీ ఆగ్రహం

image

కేంద్ర క్యాబినెట్ భేటీలో ప్రధాని మోదీ సీరియస్ కామెంట్స్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయని మండిపడ్డారు. తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని, మహిళలకు ఆ పార్టీలు సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు మహిళా బిల్లును అడ్డుకోవడం ఘోర పాపమని, పైగా సంబరాలు చేసుకోవడం ఏంటని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రశ్నించారు.

News April 18, 2026

పిల్లలతో నయన్, విఘ్నేశ్ క్యూట్ పిక్స్

image

లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తమ కవల పిల్లలతో కలిసి దిగిన క్యూట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తమ ఖాళీ సమయంలో ఉయిర్, ఉలగ్‌లతో ఈ జంట సరదాగా గడిపారు. తమ చిన్నారుల అల్లరికి సంబంధించిన చిత్రాలను షేర్ చేయగా.. అభిమానులు ఫిదా అవుతున్నారు. సెలబ్రిటీ పేరెంట్స్‌గా వారు పంచుకున్న ఈ మధుర క్షణాలు ట్రెండింగ్‌లో నిలిచాయి.