News February 17, 2025
SKLM: గ్రూప్ -2 పరీక్షలకు 15 పరీక్షా కేంద్రాలు

ఈ నెల 23న జరగనున్న గ్రూప్-2 మెయిన్స్కు ఎచ్చెర్లలో మొత్తం 15పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం తెలిపారు. మొత్తం 5,535 మంది పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. ఆ రోజు పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు, పటిష్ఠమైన పోలీసు బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీ కేంద్రం వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, సరైన లైటింగ్ ఉండాలన్నారు.
Similar News
News March 12, 2025
మందస: భార్య, కూతురు అదృశ్యం..కేసు నమోదు

మందస మండలం వాసుదేవపురం గ్రామానికి చెందిన పానిల సింహాచలం (27) తన భార్య జ్యోతి (22), కుమార్తె హన్విక (11నెలలు) కనిపించడం లేదంటూ..మంగళవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 10వ తేదీన నా భార్య, కూతురు మందస మండలం కొర్రాయి గేటు వద్ద బస్సు ఎక్కి కాశీబుగ్గ వచ్చారని, అప్పటినుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News March 12, 2025
నరసన్నపేట: చిట్ ఫండ్ అధినేత కోరాడ గణేష్ ఆస్తుల జప్తు

నరసన్నపేటలోని ‘లక్ష్మీ గణేష్ చిట్స్’ సంస్థకు చెందిన కోరాడ గణేశ్వరరావు చరాస్తులను జప్తు చేస్తూ హోం శాఖ జీవో నెం. 46 ద్వారా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. కోరాడ గణేశ్వరరావు డిపాజిట్ల పేరుతో ప్రజల నుంచి రూ.5.86 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. బాధితుల ఫిర్యాదు మేరకు నరసన్నపేట స్టేషన్లో 2021లో కేసు నమోదైంది. 5.86 కోట్లు వరకూ దోచుకోగా కేవలం చరాస్తులు రూ.15.84 లక్షలు మాత్రమే గుర్తించారు.
News March 12, 2025
జి. సిగడాం: మూడు రోజుల తర్వాత బయటపడ్డ మృతదేహం

జి.సిగడాం మండలం దేవరవలస గ్రామానికి చెందిన కొడమాటి ఈశ్వరరావు, పద్మా దంపతుల కుమారుడు అశోక్ వత్సలవలస, రాజులమ్మ యాత్ర లో ఆదివారం సముద్రంలో కొట్టుకుపోతున్న వారిని రక్షించాడానికి వెళ్లి గల్లంతయ్యాడు. బుధవారం ఉదయం సముద్ర తీరంలో మృతదేహం దొరికింది. ఈ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు దుఃఖానికి గురై విలవిలలాడుతున్నారు. పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టంకు తరలించారు.