News February 17, 2025
సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ: స్వామి

AP: గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని A, B, C కేటగిరీలుగా హేతుబద్ధీకరిస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రకటించారు. సీనియర్ అధికారులతో కమిటీ వేసి సర్వీసు నిబంధనలు రూపొందిస్తామన్నారు. ఈ ప్రక్రియలో కొందరిని తొలగిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మహిళా పోలీసుల విషయంలో శిశు సంక్షేమ, హోంశాఖలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
Similar News
News November 14, 2025
పర్యావరణం కోసం ఈ వారియర్ మామ్స్

దిల్లీలో శీతాకాలం వచ్చిందంటే చాలు వాయుకాలుష్య తీవ్రత పెరిగిపోతుంది. దీన్ని ఎదుర్కోవడానికి బవ్రీన్ వారియర్ మామ్స్కు శ్రీకారం చుట్టారు. వాయుకాలుష్యం చర్మం, జుట్టు, ఊపిరితిత్తులు, గుండెపై ప్రభావం చూపుతుంది. ఆహార ఉత్పత్తుల్లోని పోషక విలువలను నాశనం చేస్తుందంటున్న బవ్రీన్ ఎన్నో ప్రాంతాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారియర్ మామ్స్లో ప్రస్తుతం 1400లకు పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు.
News November 14, 2025
ప్రతిరోజూ ABC జ్యూస్ తాగితే జరిగేది ఇదే

ABC జ్యూస్.. యాపిల్, బీట్రూట్, క్యారెట్తో తయారు చేస్తారు. షుగర్, విటమిన్లు, ఖనిజాలు, 0.5గ్రా. ప్రొటీన్స్ లభించే ఈ జ్యూస్ తాగితే రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. పరగడుపున తాగితే శరీరంలో వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ముఖం యంగ్గా కనిపిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కేలరీలు తక్కువ ఉన్నందున బరువు తగ్గుతారు. 100మి.లీ జ్యూస్లో 45-50 కేలరీలు, 10-12గ్రా. కార్బోహైడ్రేట్లు బాడీకి అందుతాయి.
News November 14, 2025
పెరగనున్న ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులు!

TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సులకు ఫీజులు పెరిగే అవకాశం ఉంది. ఇవాళ లేదా రేపు కొత్త ఫీజులకు సంబంధించిన జీవో రానున్నట్లు తెలుస్తోంది. 2025-27 పీరియడ్కు సంబంధించి కొత్త ఫీజుల ప్రతిపాదలను టీఏఎఫ్ఆర్సీ ప్రభుత్వానికి పంపగా ఇప్పటికే ఫైనల్ చేసినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉండటంతో జీవో నిలిచిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈసీ అనుమతితో విడుదల చేయనుంది.


