News February 17, 2025
సిరిసిల్ల: అర్జీలకు వేగంగా పరిష్కారం చూపాలి: కలెక్టర్

ప్రజావాణిలో వచ్చే అర్జీలకు వేగంగా పరిష్కారం చూపాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల వద్ద నుంచి 116 దరఖాస్తుల స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Similar News
News November 6, 2025
HYD: చీమలకు భయపడి వివాహిత సూసైడ్

చీమలకు భయపడి వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అమీన్పూర్లో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నవ్య హోమ్స్లో నివసిస్తున్న మనీషా (25) ఫోబియాతో చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మనీషా 2022లో చిందం శ్రీకాంత్(35)ను వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె అన్వీ(3) ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
News November 6, 2025
వనపర్తి: ప్రతి నెల గ్రామసభలు నిర్వహించాలి

గ్రామస్థాయి అధికారులు ప్రతినెల గ్రామసభలు నిర్వహించి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారి తరుణ్ సూచించారు. గ్రామస్థాయి లైన్ డిపార్ట్మెంట్ అధికారులకు నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామ సభల ద్వారా దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాలని ఆయన సూచించారు.
News November 6, 2025
HYD: చీమలకు భయపడి వివాహిత సూసైడ్

చీమలకు భయపడి వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అమీన్పూర్లో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నవ్య హోమ్స్లో నివసిస్తున్న మనీషా (25) ఫోబియాతో చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మనీషా 2022లో చిందం శ్రీకాంత్(35)ను వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె అన్వీ(3) ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


