News February 17, 2025
సిరిసిల్ల: ‘బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి’

బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు బీసీ సాధికారిత సంఘం నాయకులు సోమవారం ప్రజావాణిలో వినతి పత్రం అందించారు. బీసీలకు 42 శాతం రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు విద్యలో, ఉపాధిలో 56 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సాధికారత రాష్ట్ర, జిల్లా నాయకులు కొండ దేవయ్య, పొలాస నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 1, 2026
పుతిన్ నివాసంపై దాడి అబద్ధం.. రష్యాకు CIA షాక్

తమ అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి యత్నించిందన్న రష్యా ఆరోపణలను US గూఢచారి సంస్థ CIA కొట్టిపారేసినట్లు అమెరికన్ మీడియా సంస్థలు తెలిపాయి. వాటి కథనాల ప్రకారం.. ఉక్రెయిన్ లక్ష్యం కేవలం సైనిక స్థావరాలేనని పుతిన్ నివాసం కాదని CIA తెలిపింది. ఈ మేరకు CIA డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ అధ్యక్షుడు ట్రంప్నకు నివేదిక సమర్పించారు. ఆధారాలు లేకుండా రష్యా ఆరోపణలు చేయడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
News January 1, 2026
తిరుమల లడ్డూ విక్రయాల్లో రికార్డ్..!

ఈ ఏడాది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి. 2024లో 12.15కోట్ల లడ్డూలు విక్రయించారు. 2025లో 10 శాతం అధికంగా 13.52 కోట్ల లడ్డూలను భక్తులకు అందించారు. డిసెంబర్ 27న ఒక్కరోజే 5.13 లక్షల లడ్డూలు అమ్ముడుబోయాయి. గత దశాబ్దం కాలంలో ఎక్కువ సంఖ్యలో లడ్డూలు విక్రయించడం ఇదే రికార్డ్. లడ్డూ నాణ్యత, రుచి మెరుగుపడటంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని టీటీడీ తెలిపింది.
News January 1, 2026
VJA: అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు, పాలకమండలి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూలైన్లు, భద్రత, తాగునీరు, తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు.


