News February 17, 2025
సిద్దిపేట: కలెక్టరేట్లో బయోమెట్రిక్ విధానం అమలు

సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో విధులు నిర్వహిస్తున్న అన్ని శాఖల అధికారులు, సిబ్బంది హాజరు వివరాల నమోదు కోసం బయోమెట్రిక్ విధానం అమలులోకి తెస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి తెలిపారు. బయోమెట్రిక్ యంత్రాల ఫిట్టింగ్ పనులను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి జిల్లా అధికారుల నుంచి కింద స్థాయి సిబ్బంది వరకు బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదుకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
Similar News
News April 19, 2026
బయోమెట్రిక్ ద్వారానే మొక్క కొనుగోలు: ADB కలెక్టర్

మొక్కజొన్న పండించిన రైతులు తమ మొక్క జొన్న పంటని బయటి మార్కెట్లో తక్కువ ధరకి అమ్మి నష్టపోకుండా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వేలిముద్ర బయోమెట్రిక్ విధానము ద్వారా మాత్రమే కొనుగోలు చేస్తామన్నారు. కౌలు రైతులు వ్యవసాయ విస్తీర్ణ అధికారి ద్వారా కౌలు వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి తమ పంటను సంబందిత కొనుగోలు కేంద్రంలో షెడ్యూల్ ప్రకారం అమ్ముకోవాలన్నారు.
News April 19, 2026
ఆదిలాబాద్లో సోమవారం ప్రజావాణి రద్దు

జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ వారోత్సవాలు, వివిధ అధికారిక కార్యక్రమాల నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వారోత్సవాల నిర్వహణలో అధికార యంత్రాంగమంతా నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. తదుపరి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
News April 19, 2026
ADB: మొక్కజొన్న కొనుగోలుకు 11 కేంద్రాలు

మొక్కజొన్న కొనుగోలుకు ఆదిలాబాద్ జిల్లాలో 11 కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. పలు కేంద్రాలను ప్రారంభించామని.. మిగతా కొనుగోలు కేంద్రాలు కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు. రైతులు తమ పంటను బయటి మార్కెట్లో తక్కువ ధరకు అమ్మి నష్టపోకుండా, తమ మొక్కజొన్న పంటను చెత్తచెదారం లేకుండా తేమ 14% మించకుండా షెడ్యూల్ ప్రకారం కొనుగోలు కేంద్రాలలో అమ్మి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు.


