News February 17, 2025

BREAKING: గోదావరిఖని: నదిలో దూకింది..!

image

పెద్దపల్లి జిల్లా ముస్త్యాల గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళ కొద్దిసేపటి క్రితం గోదావరిఖని శివారులోని గోదావరి బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకిందని స్థానికులు తెలిపారు. నదిలో నీరు లేని ప్రదేశంలో పడటంతో ఆమెకు బలమైన గాయాలయ్యాయని చెప్పారు. స్థానికులు గమనించి ఆమెను స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్యకు యత్నించిందో కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 11, 2025

HYD: ఓటు వేసి ఈ పని చేయండి

image

ఓటు వేయడం మన బాధ్యత.. మనం ఓటేస్తే ఇంకొకరు పోలింగ్‌ బూత్‌కు వెళతారు.. అందుకే మీరు ఓటు వేసిన తరువాత బయటకు వచ్చి ‘నేను ఓటు వేశా.. మరి మీరు..? అని క్యాప్షన్‌ పెట్టి మీ ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, ఇతర సోషల్‌ మీడియాల్లో పోస్ట్‌ చేయండి. దానిని చూసిన మరికొందరికి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఓటేస్తారు. ఇలా అందరూ చేస్తే పోలింగ్‌ శాతం పెరుగుతుంది..మంచి నాయకుడు గెలుస్తారు.

News November 11, 2025

జూబ్లీహిల్స్‌ బై పోల్: ఇది ఐడీ కార్డు కాదు.. లైఫ్ కార్డు

image

మీరు కొత్త ఓటరా.. ఈ మధ్యనే ఓటరుగా నమోదయ్యారా..! గుర్తుంది కదా.. నేడే పోలింగ్‌ డేట్‌. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్‌ ప్రారంభమవుతుంది. ఓటరు కార్డు వచ్చింది కదా అని పర్సులో పెట్టి అలా వదిలేయకండి. ఓటు వేసి మీ నిర్ణయం చెప్పండి. అది కేవలం గుర్తింపు కార్డు కాదు.. మన జీవితాలను డిసైడ్‌ చేసే కార్డు. దానిని ఉపయోగించండి. పని చేయని నాయకులకు బుద్ధి చెప్పే యత్నం చేయండి.

News November 11, 2025

VKB: లగచర్ల ఘటనకు నేటికి ఏడాది

image

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన లగచర్ల ఘటన జరిగి నేటికి ఏడాది అవుతుంది. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్‌కు దుద్యాల మండలం లగచర్లతో పాటు మరో రెండు గ్రామాల్లో భూసేకరణ చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. హాజరైన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, సబ్ కలెక్టర్, ఇతర అధికారులపై దాడికి పాల్పడిన సంగతి విదితమే. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే సహా పలువురు గ్రామస్థులు అరెస్టు కావడంతో ఉద్రిక్తత కొనసాగింది.