News February 17, 2025
నంద్యాలలో 37°C ఉష్ణోగ్రత

నంద్యాల జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ నంద్యాలలో ఏకంగా 37°C ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని మిగతా మండలాల్లోనూ 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కర్నూలులో 38°C ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News September 15, 2025
విశాఖ బీచ్ పరిశుభ్రత లోపాలపై కమిషనర్ ఆగ్రహం

విశాఖ వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే ధ్యేయమని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు. కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు ఎక్కడా వ్యర్థాలు కనిపించకూడదని ఆదేశించారు. ఆటుపోట్లు ఎక్కువగా ఉండే పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ముందుస్తు ప్రణాళికలు వేసుకోవాలన్నారు. RK బీచ్లో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో బీచ్ స్వీపింగ్ యంత్రాలు నిర్వహించే ఏజెన్సీ ఫామ్టెక్ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
News September 15, 2025
గద్వాల: రుణాలు సకాలంలో మంజూరు చేయాలి: కలెక్టర్

గద్వాల జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు అన్ని బ్యాంకులు రైతులకు పంట, అనుబంధ రంగాల రుణాలు, ఉపాధి యూనిట్ల స్థాపన, చిన్న, మధ్య తరహా, విద్యా, గృహ రుణాలు తదితర ప్రాధాన్యతా రంగాల రుణాలను సకాలంలో మంజూరు చేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఎంపీ మల్లు రవితో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వకర్మ యోజన కింద అర్హులైన లబ్ధిదారులకు యూనిట్లను మంజూరు చేయాలన్నారు.
News September 15, 2025
ములుగు: ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా సీతక్క

ఈనెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల నేపథ్యంలో ములుగు జిల్లాలో జరిగే కార్యక్రమానికి మంత్రి సీతక్కను ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. అతిధి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించడం, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించడం జరుగుతుంది.