News February 17, 2025

స్కూలు విద్యార్థులకు కంటి పరీక్షలు: డీఎంహెచ్వో 

image

వరంగల్ జిల్లాలో 36,368 మంది విద్యార్థులు ఉండగా అందులో 33,516 మందికి కంటి పరీక్షలు 92.36% నిర్వహించినట్లు డీఎంహెచ్వో సాంబశివరావు తెలిపారు. అందులో నుంచి 1074 మంది కంటి దృష్టి లోపాలతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించామన్నారు. వారికి నేత్ర వైద్యులతో పరీక్షలు చేస్తూ ఆన్‌లైన్లో స్టేట్‌కి పంపించడం జరుగుతున్నదన్నారు. ఈ కార్యక్రమము నేటి నుంచి మార్చ్ 3 వరకు పూర్తి చేయాలన్నారు.

Similar News

News July 11, 2025

ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకంపై కలెక్టర్ సమీక్ష

image

ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద వరంగల్ కలెక్టర్ సమావేశ మందిరంలో గురువారం సమీక్ష నిర్వహించారు. పథకం అమలు, లబ్ధిదారుల శిక్షణ, ఆర్ధిక సహకారం, టూల్ కిట్ల పంపిణి తదితర అంశాలపై సమీక్షించారు. పరిశ్రమలకు వేగవంతమైన అనుమతులకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

News July 10, 2025

WGL: మక్కలు బిల్టీ క్వింటా రూ.2,430

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి గురువారం వివిధ రకాల చిరుధాన్యాల ఉత్పత్తులు తరలివచ్చాయి. ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు బిల్టీ క్వింటా రూ.2,430 పలకగా.. పసుపు రూ. 12,259 ధర పలికింది. అలాగే సూక పల్లికాయకి ధర రూ.5,800 రాగా.. పచ్చి పల్లికాయకి రూ.3,600 ధర వచ్చిందని అధికారులు తెలిపారు. .

News July 10, 2025

వరంగల్: యూరియా కొరత.. నాట్లు వేసేదెలా?

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఇంకా 50 శాతం యూరియా జిల్లాకు రావాల్సి ఉందని వ్యవసాధికారులు చెబుతున్నారు. అయితే నారుమళ్లలో వరి నారు ముదిరిపోతోందని రైతులు దిగులు చెందుతున్నారు. సకాలంలో యూరియా అందజేస్తే వరి నాట్లు వేసుకుంటామని రైతులు అంటున్నారు. యూరియా అందక వర్షాలు పడక నారు మళ్లలోనే వరినారు ఎండిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.