News February 17, 2025

కామారెడ్డి: ప్రజావాణిలో 58 ఫిర్యాదులు వెల్లువ

image

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజావాణిలో 58 ఫిర్యాదులు వచ్చినట్లు వివరించారు.

Similar News

News November 5, 2025

జుక్కల్: పత్తి కూలీల కొరత.. రైతుల్లో గుబులు!

image

జుక్కల్ నియోజకవర్గంలో పత్తి రైతులకు కూలీల కొరత సమస్యగా మారింది. నియోజకవర్గంలో మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పెద్ద కొడప్గల్, పిట్లం మండలాల్లో సాగు చేసిన పత్తి కోత దశకు చేరుకుంది. అయితే, కూలీలు దొరకక రైతులు ఆందోళన చెందుతున్నారు. కిలో పత్తి తీతకు రూ.10 నుంచి రూ.12 వరకు చెల్లించినా, కూలీలు అందుబాటులో లేరు. అకాల వర్షాల వల్ల పంటకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News November 5, 2025

‘అల్లూరి జిల్లాలో హోం పర్యాటకం విజయవంతం చేయాలి’

image

జిల్లాలో హోం పర్యాటకం విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం కృషి చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ సూచించారు. బుధవారం పాడేరు ITDAలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, పీఎం జుగా పథకం కింద జిల్లాలో ఇప్పటికే 150 గృహాలకు హోంస్టే కోసం అనుమతులు లభించాయన్నారు. 40 లక్షల గడప ఉన్న జిల్లాలో 40 వేల హోంస్టేలు ఏర్పాటు చేసేవిధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

News November 5, 2025

యాలాల్: ‘అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది’

image

రోడ్డు ప్రమాదంలో మరణించిన యాలాల్ మండలానికి చెందిన పలు కుటుంబాలను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. పేర్కంపల్లి గ్రామానికి చెందిన సాయిప్రియ, నందిని, తనూష కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.7 లక్షల చొప్పున ముగ్గురికి మొత్తం రూ.21 లక్షల చెక్కులను అందజేశారు. అనంతరం లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన గుర్రాల అఖిల రెడ్డి కుటుంబానికి రూ.7లక్షల చెక్కును అందజేశారు.