News February 17, 2025
పార్వతీపురం: ఇటలీలో ఉద్యోగాలంటూ మోసం

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి తెరలేపారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది. పార్వతీపురానికి చెందిన ఓ ఏజెంట్తో కలిసి ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి వాసి ఈ మోసానికి పాల్పడ్డారు. జిల్లాలో ఒక్కొక్కరి నుంచి రూ.1.20 లక్షలు చొప్పున రూ.3 కోట్లకు పైగా వసూళ్లు చేశారు. దాదాపు 350 మంది నిరుద్యోగులను ఇటలీ పంపగా.. అక్కడ సరైన ఉద్యోగం లేక మోసపోయారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News November 12, 2025
నడిగూడెం: నాటి తొలి బోర్డు హైస్కూల్- నేటి జడ్పీ స్కూల్

నడిగూడెంలో కొల్లు పాపయ్య చౌదరి విరాళంతో 1950లో 4 ఎకరాల్లో ఉన్నత పాఠశాల నిర్మించారు. అప్పట్లో ఉమ్మడి ఏపీ కృష్ణా జిల్లాలో ఇదే మొదటి బోర్డు హైస్కూల్గా గుర్తింపు పొందింది. కోదాడ, సూర్యాపేట నుంచి విద్యార్థులు వచ్చి హెచ్ఎస్ఎల్సీ వరకు ఇక్కడ చదివేవారు. దూర ప్రాంత విద్యార్థుల కోసం వసతి గృహాన్ని కూడా నిర్మించారు. నాటి నుంచి నేటి వరకు ఇది జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలగా కొనసాగుతోంది.
News November 12, 2025
వరంగల్ మార్కెట్లో స్వల్పంగా పెరిగిన మిర్చి ధరలు..!

WGL ఎనుమాముల మార్కెట్లో బుధవారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు మంగళవారం రూ.18,200 ధర రాగా.. నేడు రూ.18,300 అయింది. వండర్ హాట్ (WH) మిర్చి నిన్నటి లాగే రూ.17,500 పలికింది. తేజ మిర్చికి కూడా నిన్నటి లాగే ఇవాళ రూ.14,900 ధర వచ్చింది. అలాగే దీపిక మిర్చి నిన్న రూ.15 వేలు పలకగా ఈరోజు రూ.15,500 పలికింది.
News November 12, 2025
‘తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా చూడండి’

AP: మొంథా తుఫాన్ నష్టంపై వేగంగా నివేదిక ఇచ్చి.. రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం చంద్రబాబు కోరారు. తుఫాన్ వల్ల రూ.6,384 కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణ సాయంగా రూ.2,622 కోట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రం బృందం CMతో సమావేశమైంది. తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని బృంద సభ్యులను సీఎం కోరారు.


