News February 17, 2025
టీమ్ ఇండియా ఫొటోషూట్.. పిక్స్ వైరల్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమ్ ఇండియా ఫొటో సెషన్లో పాల్గొంది. ఇందులో భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అర్ష్దీప్ సింగ్ తదితరులు సందడి చేశారు. టీ20 టీమ్, టెస్టు టీమ్ క్యాప్లు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. ఈ జెర్సీలపై పాకిస్థాన్ అని పేరు రాసి ఉండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Similar News
News March 12, 2025
EAPCET నోటిఫికేషన్ విడుదల

AP: EAPCET <<15723472>>నోటిఫికేషన్ను <<>>JNTU కాకినాడ విడుదల చేసింది. దీని ద్వారా ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 15వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా, ఏప్రిల్ 24వ తేదీ వరకు అప్లై చేయవచ్చు. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయి.
News March 12, 2025
ఒకే ఫ్రేమ్లో నాని, విజయ్ దేవరకొండ, మాళవిక

నాని, విజయ్ దేవరకొండ, మాళవికా నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా ఈనెల 21న రీరిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నటీనటులు 10 ఏళ్ల తర్వాత ఒక్కచోటకు చేరారు. సినిమాలో ఉన్నట్లు ఒకే బైక్పై ముగ్గురు కూర్చొని కెమెరాలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. ఇండస్ట్రీలో ఇన్నేళ్లలో ఎన్నో మార్పులొచ్చినా వీరి బాండింగ్ మారలేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News March 12, 2025
ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం: రేవంత్

TG: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ తెలిపారు. ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర తమదేనని చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కొలువుల పండగలో 1,532 మందికి సీఎం నియామక పత్రాలు అందజేశారు. ‘కేసీఆర్ ఫ్యామిలీకి ఉద్యోగాలు పోవడం వల్లే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయి. గత పన్నెండేళ్లలో ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు’ అని ఆయన పేర్కొన్నారు.