News February 18, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి CRIME NEWS!

image

@గ్రీవెన్స్ డేలో 10 మంది అర్జీదారులతో ఎస్పీ @మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడికి 45 రోజుల జైలు శిక్ష..రూ.500 జరిమానా @జగిత్యాల పట్టణంలోని ఇంట్లో కాలిన కరెంటు మీటర్ @ఇబ్రహీంపట్నంలో ఎస్ఐ అనిల్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు @కథలాపూర్‌లో యువకుడు ఊరేసుకుని ఆత్మహత్య @పెగడపల్లిలో రైతులను మోసం చేసిన వ్యక్తులను రిమాండ్ చేసిన పోలీసులు @రాయికల్‌లో ఇద్దరు మృతి.. ఆర్థిక సాయం అందజేసిన గ్రామస్థులు

Similar News

News December 27, 2025

పెరిగిన ట్రైన్ ఛార్జీలు.. RGM-సికింద్రాబాద్‌‌కు ఎంతంటే..?

image

రైల్వే శాఖ రైళ్ల ఛార్జీలను పెంచింది. 215 KMలకు పైగా ట్రావెల్ చేసేవారిపై KMకు పైసా చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 224 KMల దూరమున్న రామగుండం- సికింద్రాబాద్‌(భాగ్యనగర్‌, ఇంటర్‌సిటీ) ట్రైన్లకు మొన్నటివరకు రూ.90 టికెట్ ధర ఉండగా పెరిగిన ధరతో అది రూ.95కు చేరింది. ఇక సూపర్‌ఫాస్ట్‌ ఛార్జ్ రూ.110గా ఉంది. పెరిగిన ఛార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. PDPL-సికింద్రాబాద్‌కు పాత ఛార్జీలే.

News December 27, 2025

పబ్లిక్ ప్లేస్‌లో పావురాలకు మేత వేస్తున్నారా?

image

చాలామంది రోడ్లమీద, పార్కుల్లో పావురాలకు మేత వేస్తూ ఉంటారు. వాటి వల్ల అనారోగ్య <<15060184>>సమస్యలు<<>> వస్తాయని చెప్పినా లెక్కచేయరు. అయితే అలా చేసిన ఓ వ్యాపారికి ముంబై కోర్టు రూ.5వేలు ఫైన్ వేసింది. అతను చేసిన పనిని హ్యూమన్ లైఫ్, హెల్త్‌కి ముప్పుగా, ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్ స్ప్రెడ్ చేసే చర్యగా పేర్కొంది. పావురాలతో మనకు ఎంత ప్రమాదం పొంచి ఉందో ఈ వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News December 27, 2025

ప్రయాణికులకు ఊరట.. ఖమ్మం మీదుగా 10 ప్రత్యేక రైళ్లు

image

సంక్రాంతి పండగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం మీదుగా మొత్తం పది ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు స్టేషన్ చీఫ్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ డి.రాజగోపాల్ వెల్లడించారు. ఇందులో ఐదు రైళ్లు ఖమ్మం మీదుగా రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు. జనవరి 9 నుంచి 20 వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.