News February 18, 2025
కరీంనగర్లో విషాద ఘటన

కరీంనగర్లో విషాద ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మల్యాల మండలం నూకపల్లి వాసి చెవులమద్ది స్రవంతి(29) 8నెలల గర్భిణి. ఆదివారం చెకప్కు జగిత్యాలకు వెళ్లగా హార్ట్, ఉమ్మనీరు ప్రాబ్లమ్ ఉందని HYDకి వెళ్లాలని వైద్యులు తెలిపారు. దీంతో ఆమెను KNRకు తరలించి, చికిత్స అందించినప్పటికీ లోపల బిడ్డ మృతిచెందాడు. వైద్యులు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే పరిస్థితి విషమించి స్రవంతి కూడా మరణించింది.
Similar News
News April 18, 2026
KNR: పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో HYD దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళ పాలిటెక్నిక్ సంస్థలో 3 సంవత్సరాల 2026-27 డిప్లమో కోర్సులకు అనాధ బాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా శిశు సంక్షేమ అధికారి తెలిపారు. దీనికి పాలిటెక్ని ప్రవేశపరిక్ష రాయకున్నా టెన్త్ పాస్ అయి ఉండాలి. ఎంపికైన వారికి ఉచిత విద్య వసతి కల్పిస్తారు. మే 23లోగా KNR బాల రక్షభవన్లో దరఖాస్తు చేయాలి. వివరాలకు 9490881098 సంప్రదించవచ్చు.
News April 18, 2026
KNR: కంటతడి పెట్టించిన రోడ్డు ప్రమాద బాధితుల గాథలు

రోడ్డు ప్రమాదాలు మిగిల్చిన తీరని శోకం కరీంనగర్ సదస్సులో ప్రతిధ్వనించింది. ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమంలో ప్రమాద బాధితులు తమ ఆవేదనను పంచుకోగా, డీజీపీ శివధర్ రెడ్డితో సహా సభలోని సభ్యులు కంటతడి పెట్టారు. ఒకరి నిర్లక్ష్యం కుటుంబాలను ఎలా రోడ్డున పడేస్తుందో వివరిస్తూ బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ గాథలు వాహనదారుల బాధ్యతారాహిత్యానికి ‘చెంపపెట్టు’ కావాలని డీజీపీ పేర్కొన్నారు.
News April 18, 2026
KNR: కంటతడి పెట్టించిన రోడ్డు ప్రమాద బాధితుల గాథలు

రోడ్డు ప్రమాదాలు మిగిల్చిన తీరని శోకం కరీంనగర్ సదస్సులో ప్రతిధ్వనించింది. ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమంలో ప్రమాద బాధితులు తమ ఆవేదనను పంచుకోగా, డీజీపీ శివధర్ రెడ్డితో సహా సభలోని సభ్యులు కంటతడి పెట్టారు. ఒకరి నిర్లక్ష్యం కుటుంబాలను ఎలా రోడ్డున పడేస్తుందో వివరిస్తూ బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ గాథలు వాహనదారుల బాధ్యతారాహిత్యానికి ‘చెంపపెట్టు’ కావాలని డీజీపీ పేర్కొన్నారు.


