News February 18, 2025
బర్డ్ఫ్లూ బఫర్ జోన్లో నిరంతర అప్రమత్తత: కలెక్టర్

గంపలగూడెం మండలంలోని కోళ్ల మరణాలకు సంబంధించి బర్డ్ఫ్లూ నిర్ధారణ కావడంతో 10 కిలోమీటర్ల పరిధిలోని 35 గ్రామాల్లో తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలను కొనసాగించాలని కలెక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. అనుమల్లంక ఘటన నేపథ్యంలో నివారణ, నియంత్రణ చర్యలపై సమీక్షించేందుకు కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
Similar News
News November 10, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 10, 2025
మరిపెడ: తండా నుంచి హైకోర్టు న్యాయవాదిగా..

మరిపెడ మండలం దంటకుంట తండాకు చెందిన భూక్య శ్రీనివాస్ నాయక్ రాష్ట్ర హైకోర్టు న్యాయవాదిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. మారుమూల తండా నుంచి ప్రస్థానాన్ని ప్రారంభించి క్రమశిక్షణతో ఉన్నత చదువులు చదివి న్యాయశాఖలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా చేరారు. లా విద్యను సంగారెడ్డిలోని టిటిడబ్ల్యూఆర్ కళాశాల నుంచి పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ను పలువురు అభినందించారు.
News November 10, 2025
రాయచోటి కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం

ఇవాళ ఉదయం రాయచోటి కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. అర్జీలు జిల్లా కలెక్టరేట్కు రాకుండా meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చనన్నారు. అర్జీ స్థితి తెలుసుకోవడానికి 1100 కాల్ సెంటర్ను సంప్రదించవచ్చునని ఆయన చెప్పారు. అర్జీలు స్థానికంగా పరిష్కారం కాని ప్రజలు జిల్లా కేంద్రానికి రావలసిందిగా తెలిపారు.


