News March 21, 2024
స్ట్రాంగ్ రూములు పటిష్టంగా ఏర్పాటు చేయండి :కలెక్టర్
ఎన్నికల కోసం రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూములను పటిష్టంగా ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్యతో కలిసి స్ట్రాంగ్ రూములు ,కౌంటింగ్ హాళ్ల ఏర్పాటును పరిశీలించారు. రాయలసీమ యూనివర్సిటీలో 8 నియోజకవర్గాల స్ట్రాంగ్ రూములు ,కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు.
Similar News
News July 8, 2024
పాప ఆచూకీ తెలిసినవారు మాకు తెలియజేయండి : ఎస్ఐ జయశేఖర్
ఎనిమిదేళ్ల చిన్నారి అదృశ్యమైన ఘటన ఆదివారం జరిగింది. ఎస్సై జయశేఖర్ వివరాలు..పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన 8ఏళ్ల చిన్నారి వాసంతి ఆదివారం మధ్యాహ్నం ఆడుకోవడానికి బయటికి వెళ్లింది. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ముచ్చుమర్రి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన కేసు నమోదు చేసుకొని పాప కోసం గాలిస్తున్నారు. పాప ఆచూకీ తెలిసినవారు పోలీసుస్టేషన్ను సంప్రదించాలని కోరారు.
News July 8, 2024
కర్నూలు: వెబ్సైట్లో ఇసుక నిల్వల వివరాలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో ఇవాళ నుంచి ఉచిత ఇసుక విధానం అమలవుతోంది. వినియోగదారులు ఇసుక సమాచారం వివరాలు https://www.mines.ap.gov.in/permit/ అనే వెబ్సైట్లో చూసుకోవాలని జిల్లా గనులు, భూగర్భ శాఖ ఉప సంచాలకులు రాజశేఖర్ తెలిపారు. ఇసుక స్టాక్ పాయింట్ ఎక్కడ ఉంది, ఎంత నిల్వ ఉంది, తదితర వివరాలు వెబ్సైట్లో ఉంటాయని పేర్కొన్నారు.
News July 8, 2024
నంద్యాల: భూ తగదా.. వేట కొడవలితో దాడి
డోన్ మండలం వెంకటనాయునిపల్లెలో భూ తగాదా హత్యాయత్నానికి దారి తీసింది. స్థానికుల వివరాలు.. మాదయ్యను అదే గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు చెన్నయ్య, ఇంద్రప్ప ఆదివారం సాయంత్రం వేట కొడవలితో తలపై నరికారు. తీవ్ర గాయాలైన మాదయ్యను వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.