News February 18, 2025
సిద్దిపేట: ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.మను చౌదరి అన్నారు. ఈనెల 27వ తేదీన జరగనున్న కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రులు, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణపై ఎన్నికల పీఓ, ఏపీఓలకు శిక్షణను ఇచ్చారు.
Similar News
News July 5, 2025
జనగామ: IIIT బాసరకు 8 మంది విద్యార్థినులు!

జనగామ జిల్లా కొడకండ్ల TGRS(G) నుంచి 8 మంది విద్యార్థినులు IIIT బాసరకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ తమ్మి దిలీప్ కుమార్ తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన హారిక, మోక్షజ్ఞ, వైష్ణవి, ఇందు, కార్తీక, శ్రీజ, నాగేశ్వరి, వేదన సీటు సాధించినట్లు చెప్పారు. ఈ విజయానికి సహకరించిన ఉపాధ్యాయ బృందంతో పాటు తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News July 5, 2025
బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైన జనగామ విద్యార్థిని

జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన మేడారం రుచిక బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం కృష్ణమూర్తి తెలిపారు. అంబేడ్కర్ నగర్లోని నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన మేడారం రవి, రాధ దంపతుల కూతురు రుచిక ట్రిపుల్ ఐటీకి ఎంపిక కావడంపై స్థానికులు అభినందించారు.
News July 5, 2025
ప్రపంచ టెస్టు క్రికెట్లో 10,000వ డకౌట్

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఇంగ్లండ్ ఆటగాడు కార్స్ డకౌట్ ప్రపంచ టెస్టు క్రికెట్లో 10,000వ డకౌట్గా నిలిచింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో ఆయన LBWగా వెనుదిరిగారు. 1877లో ఎడ్వర్డ్ గ్రెగరీ తొలిసారి డకౌట్ అయిన ప్లేయర్గా ఉన్నారు. 10,000 డకౌట్లు కావడానికి దాదాపు శతాబ్దంన్నర పట్టింది. కాగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఆరుగురు ప్లేయర్లు డకౌట్ కావడం విశేషం.