News February 18, 2025
బిచ్కుంద : పిగ్ మీ పేరిట ఘరానా మోసం

బిచ్కుంద మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో తాత్కాలికంగా దరఖాస్తులు రాసుకుంటూ ఉపాధి పొందుతున్న జంగం రాజు అనే వ్యక్తి ఖాతాదారులను పిగ్ మీ పేరిట భారీగా డిపాజిట్ల సేకరించారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు అధికారులను నిలదీయగా తమకు సంబంధం లేదని తేల్చేశారు. మోసం చేసిన వ్యక్తి కుటుంబంతో సహా పరారైయ్యాడు. రూ.60 లక్షలు స్వాహా చేశాడని బాదితులు ఆరోపిస్తున్నారు.
Similar News
News July 5, 2025
MBNR: ట్రిపుల్ ఐటీ మొదటి దశ కౌన్సెలింగ్ తేదీలు ఖరారు

మహబూబ్నగర్ ట్రిపుల్ ఐటీలో ఎంపికైన 66 మంది విద్యార్థులకు ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మొదటి దశ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వీసీ గోవర్ధన్ శుక్రవారం వెల్లడించారు. ఈనెల 7న జాబితాలోని S.No-1-564 వరకు, 8న 565-1,128 వరకు, 9న 1,129-1,690 వరకు గల విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరుకావాలన్నారు. దరఖాస్తులో పొందుపరిచిన సర్టిఫికేట్లతో ఉదయం 9 గంటల వరకు IIITలో హాజరుకావాలని కోరారు. SHARE IT.
News July 5, 2025
పోరుమామిళ్ల: హత్య కేసులో పదేళ్ల జైలు శిక్ష

ఆరేళ్ల క్రితం పోరుమామిళ్ల PS పరిధిలోని రామాయపల్లి గ్రామ సమీపంలో ఓ మతిస్థిమితం లేని యువతి హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలు జిలాని బాషా, నాగేంద్ర ప్రసాద్, మహబూబ్ బాషాలకు పదేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ ఎ.డి.జే కోర్టు జడ్జి దీనబాబు శుక్రవారం తీర్పునిచ్చారు. యువతిని గొంతు నులిమి హత్య చేయగా అప్పటి నుంచి విచారణ చేసిన పోలీసులకు సరైన సాక్షాధారాలు దొరకడంతో ముద్దాయిలకు శిక్ష పడింది.
News July 5, 2025
బాలినేనికి ఇక అంతా బాగేనా?

బాలినేనిని జిల్లా రాజకీయాలకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేనిపేరు. అటువంటి బాలినేనికి ఇకపై అంతా మంచే జరగబోతోందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. మార్కాపురానికి డిప్యూటీ CM పవన్ వచ్చిన సందర్భంగా బాలినేని ప్రత్యక్షమయ్యారు. మళ్లీ వైసీపీలోకి బాలినేని అంటూ పుకార్లు వినిపిస్తుండగా, ఇక్కడ కనిపించడంతో ఓ క్లారిటీ వచ్చింది. పవన్ ప్రసంగంలో బాలినేని మంచి నేత అని చెప్పడంతో, ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ది టాక్ నడుస్తోంది.