News February 18, 2025

HYDలో రూ.150 కోట్లతో సుందరీకరణ పనులు

image

HYD ఇమేజ్‌ను పెంచేందుకు ప్రభుత్వం రూ.150 కోట్లతో 106 ప్రాంతాల్లో సుందరీకరణ పనులు చేపట్టింది. షేక్‌పేట్, జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి పనులకు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి  శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు 78 ప్రాజెక్టులు పూర్తి కాగా, మిగిలినవి ప్రగతిలో ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టితో పనులు వేగంగా సాగుతున్నాయి.

Similar News

News November 4, 2025

BREAKING: జూబ్లీపోరులో BJPకి జనసేన సపోర్ట్

image

జూబ్లీహిల్స్ బైపోల్ వేడి తారస్థాయికి చేరింది. బీజేపీకి జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్‌గౌడ్ భేటీ అయ్యి, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. తమ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా జనసేన నాయకులు ప్రచారంలో పాల్గొననున్నట్లు ఇరు పార్టీలు వెల్లడించాయి.

News November 4, 2025

సర్కారు వారి పాట.. ఎకరం రూ.99 కోట్లు

image

రూ.1,2 కోట్లు కాదు.. రూ.99 కోట్లు.. ఇదీ కోకాపేటలోని ఒక ఎకరానికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర. ఈ మొత్తం చెల్లిస్తే ఎకరం సొంతం చేసుకోవచ్చు అనుకుంటే పొరపాటే. దీనికి వేలం వేస్తారు. అంటే ఈ రేటు డబుల్ కావచ్చు. ఈ నెల 24, 28 తేదీలతోపాటు వచ్చేనెల 3, 5 తేదీల్లో ప్రభుత్వం ఈ-వేలం వేయనుంది. ఈ మేరకు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో కనీసం రూ.150 కోట్లైనా సంపాదించాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.

News November 4, 2025

మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌లో వర్షం

image

రానున్న 2-3 గంటల్లో నగరంలో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముండగా, ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీలోపు ఉండే అవకాశం ఉందని సూచించింది. ప్రజలు వర్షం సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.