News February 18, 2025
పార్వతీపురం: ఆమె రాకతోనైనా సమస్య తీరనుందా?

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏళ్ల తరబడి ఏనుగుల సమస్య పట్టిపీడుస్తోంది. పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో 7 ఏనుగులు ఉండగా, పాలకొండ నియోజకర్గంలో 4 ఏనుగులు సంచరిస్తున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణ నష్టం, వందల ఎకరాల్లో పంటలను ఏనుగులు పాడుచేశాయి. అయితే పార్వతీపురం మన్యం జిల్లాలో రాష్ట్ర ముఖ్య అటవీ శాఖ కన్జర్వేటర్ శాంతిప్రియ మంగళవారం(నేడు) పర్యటించనున్నారు. ఆమె పర్యటనతోనైనా ఈ సమస్యకు చెక్ పడుతుందేమో చూడాలి.
Similar News
News September 18, 2025
KNR: నేటి నుంచి సదరం క్యాంపులు

కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆధ్వర్యంలో నేటి నుంచి 24వ తేదీ వరకు సదరం క్యాంపులు జరగనున్నాయని జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దివ్యాంగులు మీసేవ కేంద్రాల ద్వారా తమ పేరును నమోదు చేసుకొని, కేటాయించిన తేదీల్లో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో హాజరుకావాలని కోరారు. మొత్తం 676 మందికి ఈ క్యాంపుల్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.
News September 18, 2025
సాహిత్య పురస్కారాలకు ముగ్గురు కవులు ఎంపిక

ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు కవులు సాహిత్య పురస్కారాలకు ఎంపిక య్యారు. NKP మండలానికి చెందిన సాగి కమలాకరశర్మ ఇటీవల దివాకర్ల వేంకటావధాని సాహిత్య పురస్కారానికి ఎంపిక కాగా.. నల్గొండకు చెందిన ఎస్. రఘు, సూర్యాపేట జిల్లా అనంతారం గ్రామానికి చెందిన బైరెడ్డి కృష్ణారెడ్డి తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరి ఎంపిక పట్ల సాహిత్యకారులు హర్షం వ్యక్తం చేశారు.
News September 18, 2025
MDK: మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

మెదక్లోని గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరంలో స్పాట్ అడ్మిషన్ల కోసం ఈనెల 18, 19న దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఉమాదేవి తెలిపారు. కళాశాలలో బీఎస్సీ, బీఏ గ్రూప్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఎస్టీ విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివరాలకు 7901097706ను సంప్రదించాలని సూచించారు.