News February 18, 2025
కడియం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన గంటి రాజు (33) మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. భార్య కుమారితో కలిసి కొత్తపేట మండలం మందపల్లిలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం బైకుపై తిరిగి వస్తుండగా.. ముగ్గురు యువకులు బైకుపై ఎదురుగా వచ్చి ఢీ కొట్టారు. ప్రమాదంలో రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.
Similar News
News April 19, 2026
తూ.గో: రేపు యథావిధిగా PGRS, రెవెన్యూ క్లినిక్

తూ.గో జిల్లా వ్యాప్తంగా సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్లు యథావిధిగా జరుగుతాయని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించే జిల్లా స్థాయి కార్యక్రమంలో RDOలు, MROలు పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తారన్నారు. సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
News April 18, 2026
ఎకానమీ దిశగా కీలక అడుగులు: సీఎం చంద్రబాబు

ఇంటింటి నుంచి చెత్త సేకరణ ద్వారా సర్క్యులర్ ఎకానమీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘స్వచ్ఛ రథాలను’ ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు అన్నారు. నిడదవోలులో ఆయన మాట్లాడారు. మరుగుదొడ్లు, సోక్ పిట్లు, కిచెన్ గార్డెన్లు, మ్యాజిక్ డ్రెయిన్లు వంటి మౌలిక సదుపాయాలను విస్తృతంగా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్తును తయారు చేసేందుకు అదనంగా ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామన్నారు.
News April 18, 2026
ఎకానమీ దిశగా కీలక అడుగులు: సీఎం చంద్రబాబు

ఇంటింటి నుంచి చెత్త సేకరణ ద్వారా సర్క్యులర్ ఎకానమీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘స్వచ్ఛ రథాలను’ ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు అన్నారు. నిడదవోలులో ఆయన మాట్లాడారు. మరుగుదొడ్లు, సోక్ పిట్లు, కిచెన్ గార్డెన్లు, మ్యాజిక్ డ్రెయిన్లు వంటి మౌలిక సదుపాయాలను విస్తృతంగా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్తును తయారు చేసేందుకు అదనంగా ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామన్నారు.


