News February 18, 2025
జి.సిగడాం: పింఛను సొమ్ముతో అధికారి జంప్

జి.సిగడాంలోని పెంట గ్రామ సచివాలయంలో సర్వేయర్ పింఛను సొమ్ముతో పరారైనట్లు సచివాలయ సిబ్బంది ఆరోపించారు. ఈ మేరకు వారు సర్వేయర్ భాను ప్రతాప్ రూ. 49 వేలు తీసుకెళ్లాడని సోమవారం తహశీల్దార్ ఎం. శ్రీకాంత్, ఎంపీడీవో రామకృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. ఈనెలకు సంబంధించి రూ. 1.66 లక్షల సొమ్ములో రూ. 1.17 లక్షలు పంపిణీ చేసి మిగిలిన సొమ్ముతో ఉడాయించినట్లు వారు ఆరోపించారు.
Similar News
News March 13, 2025
మంత్రి అచ్చెన్నాయుడుపై కేసు కొట్టివేత

ఓబులాపురం మైనింగ్పై గతంలో టీడీపీ నేతలు చేసిన ఆందోళనలకు సంబంధించిన కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, చినరాజప్ప, ధూళిపాళ్ల నరేంద్ర, జనార్దన్ రెడ్డి సహా పలువురు నేతలు ఈ కేసు నుంచి విముక్తి పొందారు. గురువారం ఉదయం విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు వద్దకు టీడీపీ శ్రేణులు చేరుకున్నారు.
News March 13, 2025
పాతపట్నం: వచ్చే నెలలో పెళ్లి.. అంతలోనే మృతి

పాతపట్నం నుంచి టెక్కలి వెళ్లే రహదారి మార్గంలోని ద్వారకాపురం గ్రామం వద్ద బుధవారం రాత్రి రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పాతపట్నం మండలం, లాబర గ్రామానికి చెందిన సనపల మధు(22) మృతి చెందాడు. మృతుడి బావ మండల శివకు గాయాలయ్యాయి. సారవకోట మండలం జమ్మి చక్రం గ్రామానికి చెందిన మరో వ్యక్తి పంతులు గోపి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడికి ఏప్రిల్ 16 న పెళ్లి నిశ్చయమైంది.
News March 13, 2025
శ్రీకాకుళం: నేడు ఈ మండలాలకు ఆరంజ్ అలర్ట్

శ్రీకాకుళం జిల్లాలో గురువారం కింది మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. ప్రజలు వడగాలులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఈ మేరకు తమ అధికారిక ‘X’ ఖాతా ద్వారా ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.*పోలాకి 37.6*నరసన్నపేట 37.8 *జి.సిగడం 40.6*ఎచ్చెర్ల 37.6* శ్రీకాకుళం 38*లావేరు 38.4 *పోలాకి 37.6*పొందూరు 39.6