News February 18, 2025
జి.సిగడాం: పింఛను సొమ్ముతో అధికారి జంప్

జి.సిగడాంలోని పెంట గ్రామ సచివాలయంలో సర్వేయర్ పింఛను సొమ్ముతో పరారైనట్లు సచివాలయ సిబ్బంది ఆరోపించారు. ఈ మేరకు వారు సర్వేయర్ భాను ప్రతాప్ రూ. 49 వేలు తీసుకెళ్లాడని సోమవారం తహశీల్దార్ ఎం. శ్రీకాంత్, ఎంపీడీవో రామకృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. ఈనెలకు సంబంధించి రూ. 1.66 లక్షల సొమ్ములో రూ. 1.17 లక్షలు పంపిణీ చేసి మిగిలిన సొమ్ముతో ఉడాయించినట్లు వారు ఆరోపించారు.
Similar News
News January 25, 2026
శ్రీకాకుళం: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

శ్రీకాకుళంలో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజా ఫిర్యాదుల నమోదుని రద్దు చేసినట్లు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని జరిగే ఈ కార్యక్రమంలో ఫిర్యాదు చేసేందుకు అర్జీదారులు ఎవరు జిల్లా కేంద్రానికి రావద్దని విజ్ఞప్తి చేశారు.
News January 25, 2026
అరసవల్లి: భక్తులకు కలెక్టర్ కీలక ప్రకటన

అరవసల్లి శ్రీ సూర్యనారాయణస్వామి ఉత్సవాలలో భాగంగా భక్తులకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం సాయంత్రం కీలక ప్రకటన చేశారు. రథసప్తమి ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారన్నారు. సాయంత్రం నాటికి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు సుమారు 1.40లక్షలు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారన్నారు. వృద్ధులు, చిన్నారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News January 25, 2026
SKLM: 10Th పాసైనా ఉద్యోగం

యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 27న ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి కే.సుధ శనివారం తెలిపారు. శ్రీకాకుళం RTC కాంప్లెక్స్ వెనుక ఉన్న నెహ్రూ యువ కేంద్రంలో ఎంపికలు ఉంటాయన్నారు. పేటీఎం సంస్థలో (10th పాస్తో) 55 ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటీవ్ పోస్ట్లు, సోలార్ ఎనర్జీలో (డిగ్రీతో) సేల్స్ ఎగ్జిక్యూటీవ్లు ఉన్నాయన్నారు. అభ్యర్థులకు 18 ఏళ్ల వయసు నిండాలన్నారు.


