News February 18, 2025
వినుకొండ: విద్యుత్ షాక్తో యువకుడు మృతి

వినుకొండలో విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని తారకరామ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా టైల్స్ పనులు నిమిత్తం నాలుగు నెలల క్రితం కార్మికులు వచ్చి పనులు నిర్వహిస్తున్నారు. సోమవారం టైల్స్ పని చేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి పవన్ కుమార్ అనే యువకుడు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News November 13, 2025
ఇండియా A విజయం

సౌతాఫ్రికా Aతో జరిగిన తొలి అనధికార వన్డేలో ఇండియా A విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 9 వికెట్లు కోల్పోయి 285 రన్స్ చేసింది. అనంతరం భారత్ 49.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (117) సెంచరీతో అదరగొట్టారు. తిలక్ వర్మ 39, నితీశ్ 37, అభిషేక్ శర్మ 31 రన్స్ చేశారు.
News November 13, 2025
BHPL: ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలి!

భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న బీసీ, ఈబీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని బీసీ అభివృద్ధి అధికారి ఇందిర తెలిపారు. ఏడాదికి రూ.4వేల మంజూరు కొరకు డిసెంబర్ 15లోగా https://telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News November 13, 2025
కీలక ప్రాంతాల రక్షణ మహిళా DCPల చేతుల్లోనే!

HYD, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని 16 జోన్లలో 7 జోన్లకు ప్రస్తుతం మహిళా డిప్యూటీ కమిషనర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ అధికారులు సౌత్ జోన్- స్నేహ మెహ్రా, మాదాపూర్ ఐటీ కారిడార్- కే.శిల్పవల్లి, కీలకమైన ఇంటెలిజెన్స్ వింగ్ వంటి సున్నితమైన, ప్రముఖ ప్రాంతాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఇది నగర పోలీసింగ్లో మహిళల ప్రాతినిధ్యం మునుపెన్నడూ లేనంత బలంగా ఉందని సీనియర్ అధికారులు చెబుతున్నారు.


