News February 18, 2025
జగిత్యాల మార్కెట్లో నేటి ధరలు ఇలా

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. కందులు గరిష్ఠంగా రూ.7250 వరకు పలికాయి. కనిష్ఠ ధర రూ.4259గా ఉంది. అనుములు రూ.5000 నుంచి రూ. 7000 మధ్య పలికాయి. మక్కలు రూ.2121 నుంచి రూ.2266 మధ్య పలికాయి. వరి ధాన్యం (HMT) రూ.2175, వరి ధాన్యం(JSR) రూ.2645గా పలికాయని మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.
Similar News
News January 1, 2026
మెదక్: ముగ్గురు పోలీస్ అధికారులకు సేవ పథకాలు

మెదక్ జిల్లాకు చెందిన ముగ్గురు పోలీస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సేవ పథకాలను ప్రకటించింది. మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్కు ఉత్తమ సేవ పథకం, ఎస్ఐ విఠల్కు సేవ పథకం, మెదక్ టౌన్ ఏఎస్ఐ రుక్సానా బేగంకు సేవ పథకం ప్రకటించారు. ఎంపికైన అధికారులను ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు అభినందించారు. భవిష్యత్లో కూడా ఇదే విధంగా ప్రజాసేవలో అంకితభావంతో పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
News January 1, 2026
న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కలకలం!

TG: న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కలకలం రేపింది. హైదరాబాద్లోని ఇల్యూషన్ పబ్లో డీజే ఆర్టిస్ట్కు డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నార్సింగిలో రాజేంద్రనగర్ SOT పోలీసులు దాడులు చేశారు. ఐదు గ్రాముల కొకైన్ సీజ్ చేశారు. మరోవైపు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు.
News January 1, 2026
భద్రాద్రి: బొకేలు వద్దు.. నోటు పుస్తకాలే ముద్దు: కలెక్టర్

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చే వారు బొకేలు, శాలువాలు తీసుకురావొద్దని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆయన, ఈ ఏడాది అందరి జీవితాల్లో సుఖశాంతులు నిండాలని ఆకాంక్షించారు. వృథా ఖర్చులకు బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగపడే నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు వంటి విద్యా సామగ్రిని అందజేయాలని కోరారు.


