News February 18, 2025
కరీంనగర్: వ్యక్తిపై కొడవలితో దాడి.. తీవ్ర గాయాలు

హత్యాయత్నం చేసిన దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన బత్తిని సాగర్ పై అదే గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి భూసంబంధిత విషయంలో కొడవలితో దాడి చేయగా సాగర్కు తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 11, 2026
హుజూరాబాద్: లాడ్జీలో యువకుడి ఆత్మహత్య

హుజూరాబాద్లోని వైస్రాయ్ లాడ్జీలో వడ్లకొండ చిరంజీవి(30) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం మందలోరిపల్లికి చెందిన చిరంజీవి, 2 రోజుల క్రితం లాడ్జీలో గదిని అద్దెకు తీసుకున్నాడు. ఆదివారం ఉదయం నుంచి అతను ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు సాయంత్రం లాడ్జీకి చేరుకొని, గది కిటికీలో నుంచి చూడగా చిరంజీవి ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించాడు.
News January 11, 2026
KNR: కంటైనర్ బోల్తా.. రైతు స్పాట్డెడ్

శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ శివారులో జరిగిన ఘోర ప్రమాదంలో స్థానిక రైతు రాణవేని హనుమంతు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ నుంచి పేపర్ లోడుతో వెళ్తున్న కంటైనర్, అండర్ ఫ్లైఓవర్ సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. రోడ్డు విస్తరణ పనుల వద్ద ఈ ప్రమాదం జరగగా, అండర్ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్న హనుమంతుపై కంటైనర్ పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
News January 11, 2026
KNR: ఊరికెళ్తున్నారా.. ఇల్లు భద్రం: సీపీ

సంక్రాంతి, మేడారం జాతర నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని KNR CP గౌష్ ఆలం సూచించారు. విలువైన ఆభరణాలు, నగదును వెంట తీసుకెళ్లడం, బ్యాంక్ లాకర్లలో ఉంచడం శ్రేయస్కరమన్నారు. ఇంటికి సెంట్రల్ లాకింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఊరెళ్లే సమాచారాన్ని పోలీసులకు తెలపాలని కోరారు. సోషల్ మీడియాలో పర్యటనల వివరాలు పంచుకోవద్దని, అనుమానితులు కనిపిస్తే డయల్ 100కు కాల్ చేయాలన్నారు.


