News February 18, 2025
ఏసీబీకి పట్టుబడ్డ మక్తల్ సీఐ, కానిస్టేబుళ్లు

ఏసీబీ వలలో సీఐ, కానిస్టేబుళ్లు పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. ఒక కేసు విషయంలో మక్తల్ సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు శివారెడ్డి, నరసింహులు రూ.20వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. మహబూబ్నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే వారి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 14, 2025
వలపు వలలో చిక్కి పాక్కు భారత రహస్యాలు.. వ్యక్తి అరెస్ట్

భారత రక్షణ రహస్యాల్ని పాక్ నిఘా సంస్థ ISIకి చేరవేస్తున్న రవీంద్ర అనే వ్యక్తిని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. UPలోని ఫిరోజాబాద్లో ఆర్డినెన్స్ పరిశ్రమలో అతడు పనిచేస్తున్నాడు. నేహా శర్మ పేరుతో ISI విసిరిన వలపు వలలో చిక్కుకుని కీలక సమాచారాన్ని వారికి చేరవేశాడని అధికారులు తెలిపారు. దానికి సంబంధించిన ఆధారాల్ని అతడి ఫోన్ నుంచి రికవర్ చేశామని, అతడి సహాయకుడినీ అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.
News March 14, 2025
మఠంపల్లి: ఘనంగా హోలీ సంబరాలు

మఠంపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో హోలీ సంబరాలు శుక్రవారం అంబారాన్నంటాయి. ఈ మేరకు ఉదయం నుంచే యువతీ యువకులు, మహిళలు, చిన్నారులు రంగులు పూసుకుంటూ ఒకరిపై ఒకరు రంగు నీళ్లు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం హోలీ.. హోలీ.. హోలీ అంటూ నినాదాలు చేస్తూ సంతోషంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు.
News March 14, 2025
మైదుకూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

మైదుకూరు మండలం కేశలింగాయపల్లె వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పి. చలమయ్య, లక్ష్మీదేవి దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. మైదుకూరు పట్టణంలో నివాసం ఉంటున్న వీరు పొలం పనులు చూసుకొని తిరిగి వెళుతుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మరొకరికి గాయాలు కావడంతో చికిత్స కోసం తరలించారు.