News February 18, 2025
రుయ్యాడిలో కత్తిపోట్ల కలకలం.. ఒకరి మృతి

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. మండలంలోని రుయ్యాడి గ్రామంలో ఓ వ్యక్తి మంగళవారం కత్తిపోటుకు గురయ్యారు. గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన గొడవలో మహేందర్ అనే వ్యక్తిని ఓ వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.
Similar News
News November 9, 2025
SFIOలో 36 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(<
News November 9, 2025
ADB: రూ.1.37 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

డ్రైవర్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.37 లక్షలు కాజేసిన ఘటన ADBలో జరిగింది. వన్ టౌన్ సీఐ సునీల్ వివరాలు.. క్రేన్ డ్రైవర్ గోల్వే సతీష్కు గుర్తుతెలియని వ్యక్తి మాట్లాడుతూ.. తమ దగ్గ లీటర్ల డిజిల్ ఉందని సగం ధరకే ఇస్తామని నమ్మించగా బాధితుడు నగదును ఫోన్పే ద్వారా చెల్లించాడు. సైబర్ నేరగాడు ఒక పెట్రోల్ పంపు చిరునామా చెప్పి డిజిల్ ఇస్తారని తెలుపగా.. బాధితుడు ఆ డీజిల్ పంపుకు వెళ్ళగా మోస పోయినట్లు గ్రహించాడు.
News November 9, 2025
రేపు భద్రాచలం, కొత్తగూడెంలో ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్

ప్రజల సౌకర్యార్థం సోమవారం భద్రాచలం సబ్ కలెక్టర్, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్కు వస్తున్నందున, వారి సౌకర్యార్థం డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇతర సమస్యలపై కలెక్టరేట్ ఇన్వార్డ్లో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.


