News February 18, 2025
సూర్యాపేట: జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు కల్లూరు వాసి

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ జాతీయస్థాయి పురుషుల సీనియర్ కబడ్డీ పోటీలకు రాష్ట్ర జట్టు కోటాలో ఎంపికయ్యాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన అనిల్ కుమార్ బాల్యం నుంచి కబడ్డీ క్రీడపై మక్కువతో సాధన చేసి జాతీయ స్థాయికి ఎదిగాడు. ఈ సందర్భంగా అనిల్ కుమార్కు గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
Similar News
News November 7, 2025
దామోదరా.. ఎంజీఎం సంగతేంది..!

MGM ఖాళీలతో సతమతం అవుతోంది. మంత్రి దామోదర రాజ నర్సింహ కేవలం సూపరింటెండెంట్ను మార్చి, ఖాళీగా ఉన్న RMO పోస్టులను అత్యవసర విభాగం వారితో నడిపిస్తున్నారు. కొన్నేళ్లుగా RMO-1, 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం మంగళవారం కల్పించిన పదోన్నతులతో ప్రస్తుతం విధుల్లో ఉన్న డిప్యూటీ RMO-2 ఎం.వసంతారావు సంగారెడ్డి(D) వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా నియమితులయ్యారు. దీంతో ప్రస్తుతం 3 RMO పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
News November 7, 2025
KMR: ఇన్ఛార్జ్ DMHOగా డా.విద్య

కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డా.విద్య నియామకమయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డా.రవీందర్ నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జిల్లా ఇన్ఛార్జ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా విధులు నిర్వర్తించిన డా.చంద్రశేఖర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వికారాబాద్ RMOగా పదోన్నతి పొంది బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో డా.విద్యను నిమయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News November 7, 2025
తిరుపతి, చిత్తూరులో పవన్ పర్యటన ఇలా..!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో Dy.CM పవన్ పర్యటన ఖరారైంది. ఈనెల 8న ఉదయం 10 గంటలకు రేణిగుంటకు వస్తారు. మామండూరు అటవీ కార్యాలయాన్ని తనిఖీ చేస్తారు. ఆ తర్వాత కలెక్టరేట్లో అటవీ శాఖ అధికారులతో సమీక్ష చేసి అదేరోజు రాత్రి విజయవాడ వెళ్తారు. తిరిగి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయల్దేరి పలమనేరు(ముసలిమడుగు) కుంకి ఏనుగుల క్యాంప్నకు చేరుకుంటారు.


