News February 18, 2025

KCR త్యాగాలు చేసింది నిజమే.. కానీ: గుత్తా

image

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘కేసీఆర్ త్యాగాలు చేసింది నిజమే.. తెలంగాణ ఉద్యమం నడిపింది వాస్తవమే.. కానీ కేసీఆర్ నాలుగు కోట్ల ప్రజల హీరో అయితే.. ఆ ప్రజలే ఎందుకు ఓడించారు. పదేపదే ప్రభుత్వం పడిపోతుంది అంటే అది అధికారం కోల్పోయిన బాధతో బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ప్రజలు అంటున్నారు’ అని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

Similar News

News November 11, 2025

పల్నాడు వెలలేని మాగాణి: పులుపుల వెంకట శివయ్య

image

వెనుక తరముల వారి వీరచరితల సిరులు, నార్వోసి త్యాగంబు నీర్వెట్టి పెంచరా! విరిసి సుఖములు పండురా, పల్నాడు వెలలేని మాగాణిరా! అంటూ పల్నాడు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన కవి పులుపుల వెంకట శివయ్య. ఆయన వినుకొండకు 1952, 62లో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వామపక్ష నేతగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్నో సమరశీల పోరాటాలు నిర్వహించారు. వినుకొండ నడిబొడ్డున ఆయన స్మారకంగా శివయ్య స్తూపం నేటికీ ఉంది.

News November 11, 2025

గద్వాల్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ఆపాలి..!

image

గద్వాల్ రైల్వే స్టేషన్‌లో కాచిగూడ-యశ్వంతపూర్ వందేభారత్ రైలును ఆపాలని ప్రయాణికులు కోరుతున్నారు. అత్యవసర సమయంలో వందేభారత్ వంటి అధునాతన రైలు గద్వాల్‌లో ఆగితే అభివృద్ధికి ఊతమిస్తుందని అభిప్రాయపడుతున్నారు. గద్వాల్ నుంచి అనంతపురం, బెంగుళూరు వంటి ప్రాంతాలకు వేగంగా ప్రయాణించడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. రైల్వే అధికారులు స్పందించి హాల్ట్ ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్..!

News November 11, 2025

ఏపీలో నేడు..

image

▶ గుంటూరులో జరుగుతున్న వాటర్ షెడ్ మహోత్సవ్‌లో పాల్గొననున్న కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. అనంతరం CM చంద్రబాబుతో భేటీ
▶ అమరావతిలో దసపల్లా 4 స్టార్ హోటల్ నిర్మాణానికి భూమిపూజ
▶ శ్రీకాకుళంలో ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న సిక్కోలు పుస్తక మహోత్సవం, 10 రోజులు కొనసాగింపు